YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి ఆరోగ్యం ఆంధ్ర ప్రదేశ్

 పరీక్షలు లేకుండా పై తరగతులకు

 పరీక్షలు లేకుండా పై తరగతులకు

 పరీక్షలు లేకుండా పై తరగతులకు
అమరావతి మార్చి 26
విద్యాశాఖ అధికారులతో ముఖ్యమంత్రి  వైయస్, జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కరోనా వైరస్ కారణంగా పరీక్షల వాయిదా, పిల్లలకు మధ్యాహ్న భోజనానికి సంబంధించి డ్రైరేషన్ తదితర  అంశాలపై చర్చ జరిగింది. కరోనా వైరస్ కారణంగా ఇతర రాష్ట్రాల్లో పరీక్షలు రాకుండానే 6 నుంచి 9వ తరగతి పిల్లలను పై తరగతులకు ప్రమోట్ చేశారని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. రాష్ట్రంలో  కూడా 6 నుంచి 9వ తరగతి వరకూ పిల్లలను అదే విధంగా ప్రమోట్ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కరోనా వైరస్ రీత్యా స్కూళ్లు మూతపడినందున పిల్లకు నేరుగా వారి ఇళ్లకే మధ్యాహ్న భోజనానికి   సంబంధించిన డ్రై రేషన్ అందిస్తున్నామని అధికారులు తెలిపారు. వాలంటీర్ల సహాయంతో పగడ్బందీగా దీన్ని పిల్లలకు చేరేలా చేయాలన్న,  అదే సమయంలో పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేసారు. అలాగే మధ్యాహ్న భోజనం అన్ని చోట్లా ఒకే క్వాలిటీ మెయింటైన్ చేయాలని అన్నారు. గోరుముద్ద అనే కార్యక్రమాన్ని గర్వంగా తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేసారు. దీన్ని మరింత  బలోపేతం చేయడానికి పూర్తి చర్యలు తీసుకోవాలని అయన ఆదేశించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, అధికారులు పాల్గొన్నారు.

Related Posts