YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ

అప్పటి వరకు పది పరీక్షలు వద్దు  హైకోర్టు

అప్పటి వరకు పది పరీక్షలు వద్దు  హైకోర్టు

అప్పటి వరకు పది పరీక్షలు వద్దు  హైకోర్టు
హైదరాబాద్ మార్చి 30 
 తెలంగాణలో పదోతరగతి పరీక్షల నిర్వహణపై హైకోర్టులో విచారణ జరిగింది. పదోతరగతి పరీక్షలన్నీ వాయిదా వేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. దీనిపై స్పందించిన న్యాయస్థానం పరిస్థితులు చక్కబడే వరకు పరీక్షలు వాయిదా వేయాలని ఆదేశించింది. మహమ్మారి కరోనా ప్రపంచ వ్యాప్తంగా భయానక రీతిలో వ్యాపిస్తున్న నేపథ్యంలో జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. పాఠశాలలు, కళాశాలలన్నీ మూతపడ్డాయి. తొమ్మిదో తరగతి వరకు ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండానే తర్వాతి క్లాసులకు ప్రమోట్‌ చేయాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పటికే నిర్ణయించాయి. మరోవైపు తెలుగు రాష్ట్రాల పరిధిలోని వివిధ యూనివర్సిటీ పరీక్షలతోపాటు, పలు ప్రవేశ పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి.

Related Posts