YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు Karnataka

‘హజ్’ సరే...మరి ‘వేుళాల’ మాట?

‘హజ్’ సరే...మరి ‘వేుళాల’ మాట?

మత వివక్ష లేదంటూనే ఒక మతాన్ని ఒకరకం గాను, మరో మతాన్ని మరో రకంగాను చూసేందుకు కేంద్ర, ఆయా రాష్ట్రాలు వివక్షను పాటిస్తున్నాయి. ముస్లింలను బుజ్జగించేందుకే హజ్‌యాత్రకు ప్రభుత్వం సాయంచేస్తోందనే ఆరోపణలను తరచుగా బీజేపీ నేతలు చేస్తున్న నేపథ్యంలో హజ్‌యాత్రకు అందించే సబ్సిడీని రద్దుచేస్తున్నామని కేంద్రం ప్రకటించింది. మరోైవెపు మరికొన్ని మతాలకు (ముఖ్యంగా హిందువులకు) పండుగలకు, తీర్థయాత్రలకు సాయాన్ని మాత్రం రద్దుచేయులేదు. సబ్సిడీని రద్దుచేసినప్పటికీ ఈ ఏడు 1.75 లక్షల మంది ముస్లింలు హజ్‌యాత్ర కు వెళ్తున్నారని కేంద్ర వైునారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ప్రకటించారు. భారత్ నుంచి నౌకల ద్వారా హజ్ యాత్రను సౌదీ అరేబియా ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించిందని, ఈ అంశంపై త్వరలో చర్చలు జరపనున్నామని ఆయన చెప్పారు. కుంభ్ మేళాకు, ఇతర పండుగలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దమొత్తంలో నిధులు ఖర్చుచేయడం గమనార్హం. వివిధ హిందూ పండగలకు, తీర్థయాత్రలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చుచేస్తున్న ప్రజాధనానికి ప్రజల పరిశీలన నుంచి ప్రభుత్వాలు తప్పించుకున్నాయి. అలహాబాద్‌లో కుంభమేళా కోసం 2014లో 1500 కోట్లు కేంద్రం ఖర్చుచేయగా మహారాష్ట్ర 2500 కోట్లు కేటాయించింది. సింహాస్థ మహాకుంభ్ కోసం మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి వంద కోట్ల రూపాయలు కేంద్రం కేటాయించింది.ఎలాంటి బుజ్జగింపులతో సంబంధం లేకుండా వైునారిటీలు మరింత గౌరవంగా స్వయంప్రతిపత్తితో జీవించేందుకు వీలుగా సబ్సిడీ రద్దుపై తీసుకు న్న విధాన నిర్ణయమని ఆయన వివరించారు. ఆరేళ్ల క్రితం అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు. 2012లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో హజ్‌యాత్ర సబ్సిడీని రద్దుచేయాలని సుప్రీంకోర్టు రా జ్యాంగ బెంచ్ ఆదేశాలను తాము అమలుచేశామని ఆయన చెప్పారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులపై ఉన్నతస్థాయి కమిటీ చేసిన సిఫార్సుల మేరకు హజ్ యాత్రకు సబ్సిడీలను నెమ్మదినెమ్మదిగా రద్దుచేయాలని ప్రభుత్వం కొత్త విధానాన్ని రూపొందించిందని ఆయన అన్నారు.

 కుంభ్ మేళా కోసం హరిద్వార్, నాశిక్, అలహాబాద్, ఉజ్జయిన్‌ల్లో పెద్దమొత్తంలో కేంద్రం ఖర్చుచేస్తోంది. దీనికి కోట్లాది మంది హాజరవుతారు.  సింహాస్థ మహాకుంభ్ కోసం మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి వంద కోట్ల రూపాయలను కేంద్రం కేటాయిం చింది. 12 ఏళ్లకోసారి (పుష్కరం) ఉజ్జయిన్‌లో ఈ కుంభ్‌మేళ జరుగుతుంటుంది. . హిమాలయాల ద్వారా టిబెట్‌లోకి సాగే కైలాస మానస సరోవర యాత్రకు కేంద్రం చెప్పుకోదగిన మొత్తాన్ని ఖర్చుచేస్తోంది.కైలాస మానస సరోవర్ యాత్రం కోసం టిబెట్, చైనా వెళ్లే యాత్రికులకు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం 50 వేల రూపాయులను మంజూరుచేసింది. ఇదే సవుయంలో కుంభ్ మేళాకు, ఇతర పండుగలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దమొత్తంలో నిధులు ఖర్చుచేయుడం గమనార్హం. వివిధ హిందుపండగలకు, తీర్థయాత్రలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చుచేస్తున్న ప్రజాధనానికి ప్రజల పరిశీలన నుంచి ప్రభుత్వాలు తప్పిం చుకున్నాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఈ మొత్తాన్ని లక్ష రూపాయలకు పెంచింది. జమ్ము కశ్మీర్‌లోని లడఖ్‌కు సింధు దర్శన్ యాత్రకు రాష్ట్రం నుంచి వెళ్లే యాత్రికులొక్కక్కరికీ 10 వేల రూపాయుల సబ్సిడీ ఇవ్వాలని ఆదిత్యనాథ్  ప్రభుత్వం నిర్ణయిం చింది. ఆయా రాష్ట్రాల నుంచి కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లే వారికి చత్తీస్‌గఢ్, ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు కూడా ఇతోధికంగా ఆర్థికసాయాన్ని అందిస్తున్నాయి. అంతేగాకుండా, అమర్‌నాథ్ యాత్ర, గణేశ్ ఉత్సవాల్లో నీటిసీసాలను శుభ్రం చేయుడానికి కేంద్రం, రాష్ట్రాలు ఎంతో ఖర్చు చేస్తున్నాయి. ఈ సహాయాలను కూడా న్యాయుస్థానాలుగానీ, ప్రభుత్వాలుగానీ రద్దుచేస్తాయా? ఇవేకాకుండా స్థానిక పండుగలకు రాష్ట్రప్రభుత్వాలు పెద్దఎత్తున ఖర్చుచేస్తున్నాయి. ఆంధ్రపదేశ్ ప్రభుత్వం కృష్ణ, గోదావరి పుష్కరాలకు, ఉత్తరాఖండ్ ప్రభుత్వం కన్వర్‌యాత్రకు, హర్యానా ప్రభుత్వం గీతా ఫెస్టివల్‌కు పెద్దమొత్తంలో ఖర్చుచేస్తున్నాయి. దీనికి తోడు దేవాలయాల జీర్ణోద్ధరణకు, వివిధ దేవతలు, దేవుళ్ల విగ్రహావిష్కరణలకు, వరుణుడి కరుణ కోసం యజ్ఞయాగాల నిర్వహణ, కొన్ని దేవాలయాలోని పూజారులకు, అధికారులకు జీతాల చెల్లింపు లకు కూడా ప్రభుత్వాలు పెద్దమొత్తాలను కేటాయిస్తున్నాయి. ఇన్ని ఖర్చులు చేస్తుండగా హజ్ యాత్రకు ఖర్చుచేసినంత మాత్రాన ప్రభుత్వ ఖజానా ఏమీ తరగిపోదు. 

Related Posts