
ఏపీలో బ్లీచింగ్ కల్టీ కుంభకోణం
గుంటూరు 17. గుంటూరు జిల్లాలో నకిలీ బ్లీచింగ్ వ్యవహారం కలకలం రేపుతోంది. తొలుత రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు పిడుగురాళ్ళలో తయారవుతున్న డిసెన్ఫెక్టెడ్ పౌడర్ను కొనుగోలు చేయాలని ఆదేశాలిచ్చారు. ఓ నేత సిఫార్సుల మేరకే ఈ పనిని ఒక కంపెనీకి అప్పగించారని తెలుస్తోంది. ఈ కంపెనీ యాజమానికి సున్నం తయారీ కేంద్రం మాత్రమే ఉంది. ఆ కంపెనీ ప్రతినిధులు కూడా ప్రభుత్వం అనుతించిన డిసెన్ఫెక్టెడ్ పౌడర్నే సరఫరా చేశామని చెబుతున్నారు. అయితే కొందరు ఆ పౌడర్ను గుంటూరులోని ఓ గిడ్డంగికి చేరవేసి బ్లీచింగ్ లాగా కల్తీ చేసి రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు పంపినట్లు, ఈ వ్యవహారంలో కొంతమంది నేతలు, అధికారులు సూత్రధారులుగా ఉన్నారు. పిడుగురాళ్ళ నుంచి సరఫరా చేసిన బ్లీచింగ్ బస్తాలపై ఎటువంటి వివరాలు లేవు. రకరకాల పేర్లతో వీటిని సరఫరా చేశారు. బస్తాలపైన తయారీ తేదీ, తూకం, ఎంఆర్పీ ధర, గడువు తేదీ వంటి వివరాలు కూడా లేవు. ఈ కుంభకోణంపై దర్యాప్తు చేసి దోషులపై చర్యలు తీసుకోవాలని గురజాల ఎమ్మెల్యే కాసు మహేశ్వరరెడ్డి, కలెక్టర్ను కోరారు. వినుకొండ నియోజకవర్గంలో కరోనా బ్లీచింగ్, ఇతర పరికరాల బిల్లులు చెల్లించవద్దని వైసీపీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అధికారులను ఆదేశించారు. ఇదిలా ఉండగా అధికార పార్టీ అండతోనే ఈ కుంభకోణం జరిగిందని టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు యరపతినేని శ్రీనివాసరావు, జీవీ ఆంజనేయులు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, గుంటూరు జిల్లా కార్యదర్శి జంగాల అజయ్కుమార్లు ఆరోపించారు. కల్తీ, బ్లీచింగ్ కుంభకోణంపై త్రిసభ్య కమిటీ దర్యాప్తు ప్రారంభించింది. జిల్లా పరిశ్రమల కేంద్రం మేనేజర్ పటేల్ నాయకత్వంలో ఈ కమిటి శనివారం పెదకాకాని మండలం నంబూరు పంచాయతీని తనిఖీ చేసింది. కాలుష్య నియంత్రణశాఖ, విపత్తుల శాఖ ప్రతినిధులు కూడా కమిటీలో ఉన్నారు. నంబూరు పంచాయతీలో నిల్వ ఉన్న పిడుగురాళ్ల బ్లీచింగ్ పౌడర్, ఇతర పరికారాల నుంచి శాంపిల్స్ సేకరించారు. బ్లీచింగ్కు సంబంధించి కొనుగోలు అను మతి పత్రాలు, ఇతర వివరాలను సేకరించారు. జిల్లా పంచాయతీ అధికారులు ఈ బ్లీచింగ్ను పం పారని పంచాయతీ సిబ్బంది లిఖిత పూర్వకంగా తెలిపారు. కాగా పిడుగురాళ్ల నుంచి బ్లీచింగ్ స్థానంలో సరఫరా చేసిన సున్నం బస్తాలను స్థానిక సచివాలయంలో నిల్వ ఉంచారు