YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

జూన్ 8కి ఎల్జీ పాలిమర్స్‌ కేసు

జూన్ 8కి ఎల్జీ పాలిమర్స్‌ కేసు

జూన్ 8కి ఎల్జీ పాలిమర్స్‌ కేసు
విశాఖపట్టణం, మే 19
విశాఖ ఎల్జీ పాలిమర్స్‌కు సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశాలపై స్టే ఇవ్వడానికి దేశ అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. ఎన్జీటీలో విచారణ తర్వాతే సుప్రీం కోర్టులో విచారణ ఉంటుందని తెలిపింది. ఎన్జీటీలో న్యాయపరమైన అంశాలు లేవనెత్తేందుకు అవకాశం కల్పించింది. ఈ పిటిషన్‌పై విచారణ జూన్ 8కి వాయిదా పడింది.ఏపీ హైకోర్టు, ఎన్జీటీ ఆదేశాలను సవాల్ చేస్తూ ఎల్జీ పాలిమర్స్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విష వాయువు లీకేజీ ఘటనలో రూ.50 కోట్లు డిపాజిట్‌ చేయాలన్న తీర్పుపై ఈ పిటిషన్ దాఖలైంది. తమ వాదనలు వినకుండానే ఏకపక్షంగా ఆదేశాలు ఇచ్చారని ఎల్జీ కంపెనీ సవాల్ చేసింది. విశాఖ ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్ లీక్ ఘటనపై ఎన్జీటీ, ఎన్‌హెచ్‌ఆర్‌సీ, హైకోర్టు ఇలా చాలా కమిటీలు వేశారని.. ఆ కంపెనీ తరఫు న్యాయవాది కోర్టుకు దృష్టికి తెచ్చారు. మే 7న ఘటన జరిగితే.. 8న విచారణ కమిటీలు వేశాయన్నారు.గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలతో రూ.50 కోట్లు జమ చేసినట్లు కోర్టుకు వివరించారు. ఎన్జీటీకి సుమోటోగా విచారణకు ఆదేశించే అధికారం లేదని ఎల్జీపాలిమర్స్‌‌ వాదనలు వినిపించింది. దీనిపై స్పందించిన ధర్మాసనం.. అవన్నీ అక్కడే తేల్చుకోవాలని సూచించింది. విచారణాధికారంపై ఎన్జీటీలో లేవనెత్తే అవకాశం కల్పించింది. జూన్‌ 1న ఎన్జీటీవిచారణ తర్వాత వాదనలు వింటామని కోర్టు తెలిపింది.

Related Posts