YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

గులాబీ పార్టీలో కీలక మార్పులు...!!

 గులాబీ పార్టీలో కీలక మార్పులు...!!

టీఆర్‌ఎస్‌ పార్టీ పగ్గాలను మంత్రి కె తారకరామారావుకు అప్పగించేందుకు లైన్ క్లియర్ అవుతోంది. అయితే తనకు ఆ పదవి వద్దంటున్నట్టు సమాచారం. ఈనెల 27న మేడ్చల్‌లో జరిగే పార్టీ ప్లీనరీలో ఈ మేరకు కొత్త బాధ్యతల్ని అప్పగించడం దాదాపు ఖాయమేనని తెలుస్తోంది. గత ప్లీనరీలోనే ఈ పదవిని ఆయనకు కట్టబెడతారని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అప్పట్లో సీఎంకేసీఆర్‌ మేనల్లుడు, పార్టీలో రెండో స్థానంలో ఉన్న హరీశ్‌రావును పక్కన పెడుతున్నారని నాయకులు, కార్యకర్తల్లో ఆందోళన వ్యక్తం కావడంతో తాత్కాలికంగా ఆ పదవిని ప్రకటించలేదు. ఆ తర్వాతి నుంచే మంత్రి కేటీఆర్‌ పార్టీపై పూర్తి పట్టు సాధించేందుకు అన్ని నియోజకవర్గాల్లోనూ విస్త్రుత పర్యటనలు చేశారు.తెలంగాణ ముఖ్యమంత్రిగా, పార్టీ అధ్యక్షునిగా కెసిఆర్ కొనసాగుతుండటం తో రెండు బాద్యతలను చూసుకోవటం కెసిఆర్ కు కాస్త కష్టం గానే ఉంది. దీంతో ఆయన పార్టీ అధ్యక్షునిగానే కొనసాగుతూ, వర్కింగ్ ప్రెసిడెంట్ హోదా లో పార్టీ బాధ్యతలను తన కుమారుడు, పంచాయతీ రాజ్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కు అప్పగించాలని అనుకున్నారు. అయితే కేటీఆర్ మాత్రం పార్టీ లో అటువంటి పదవి లేదని, ఒకవేళ అటువంటి పదవి తాను చేపడితే తనంతట తానే పదవి కల్పించుకున్నట్లు అవుతుందని, ఒకే సారి పార్టీ అధ్యక్ష పదవే చేపట్టాలని కెసిఆర్ తో చెప్పినట్లు సమాచారం.అయితే పార్టీ లోని సీనియర్ నేతలు మాత్రం కేటీఆర్ తన తండ్రి లాగా మాస్ నేత కాదని, అంతేకాకుండా కేవలం ఆరు సంవత్సరాల రాజకీయ అనుభవం ఉండటం తో పార్టీ అధ్యక్ష పదవికి సరితూగడని, అతనికి ఇంకా రాజకీయ అనుభవం కావాలని చెబుతున్నారు. కానీ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం 2017 వరకు పార్టీలోని క్షేత్ర స్దాయి నేతలతో కేటీఆర్ మమేకమై, 2019 లో జరగనున్న ఎన్నికలకు పార్టీ అధ్యక్ష పదవీ బాధ్యతలు చేపట్టే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ప్రతి జిల్లాలోనూ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల్లో భాగస్వామి అయ్యారు. అదే సమయంలో మంత్రి హరీశ్‌రావు తన శాఖాబాధ్యతలు, నియోజకవర్గానికే పరిమితం అయ్యాయి. సీఎం కేసీఆర్‌ తీసుకునే ఏ నిర్ణయమైనా తనకు శిరోధార్యమేనని మంత్రి హరీశ్‌రావు ఇప్పటికే అనేకసార్లు బహిరంగంగానే చెప్తూ వస్తున్నారు. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవి పోటీ నుంచి హరీశ్‌రావును తప్పుకొమ్మనమని ఇప్పటికే మంత్రి హరీశ్‌రావుకు సీఎం కేసీఆర్‌ చెప్పేశారని ప్రచారం జరుగుతోంది. సీఎం కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానని ప్రకటించడంతో మంత్రి కేటీఆర్‌కు అధికారం కట్టబెట్టడం ఇక లాంఛనమేనని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఎన్నికల ఏడాదిలోకి ప్రవేశించిన నేపధ్యంలో పార్టీపై పట్టు సాధించేందుకు మంత్రి కేటీఆర్‌ కూడా క్షేత్రస్థాయిలో ప్రగతియాత్రల పేరుతో హైదరాబాద్‌ సహా అన్ని జిల్లాలు చుట్టి వస్తున్నారు. 2019 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తిరిగి అధికారంలోకి వస్తే...ఆయనే ముఖ్యమంత్రి కూడా అవుతారనే ప్రచారం కూడా జరుగుతోంది. సీఎం కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లో ఆరంగేట్రంలో భాగంగా మేనల్లుడు హరీశ్‌రావును కూడా తనవెంట తీసుకెళ్తారనే మరో వార్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనివల్ల మంత్రి కేటీఆర్‌ రాజకీయ భవిష్యత్‌కు ఎలాంటి అవాంతరాలు ఉండబోవని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

Related Posts