YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్ దేశీయం విదేశీయం

హైకోర్టుకు ఆశ్రయించిన దక్షిణ కొరియా బృందం

హైకోర్టుకు ఆశ్రయించిన దక్షిణ కొరియా బృందం

హైకోర్టుకు ఆశ్రయించిన దక్షిణ కొరియా బృందం
అమరావతి జూన్23
ఎల్జీ పాలిమర్స్ ఘటనపై ఎనిమిది మంది విదేశీయులు హైకోర్టును ఆశ్రయించారు. గ్యాస్ లీకేజీ ఘటన పై దక్షిణ కొరియా నుండి వచ్చిన సాంకేతిన నిపుణుల బృందం సభ్యులను విచారణ కోసం అపివేసారు. వారిని దక్షిణ కొరియాకు వెళ్లేందుకు అనుమతివ్వాలని  వారి తరపు న్యాయవాది కోర్టును కోరారు.  పిటిషన్ ను హైకోర్టు సీజే జేకే మహేశ్వరి, జస్టిస్ కె.లలితతో కూడిన ధర్మాసనం విచారించింది. పిటిషనర్లకు,  కంపెనీకి సంబంధం లేదని, సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వ్యక్తులు కావడం వల్ల విశాఖకు వచ్చారన్న విదేశీయుల తరుపు న్యాయవాదులు కోర్లుకు విన్నవించారు. విచారణల పేరుతో ఆపేశారని  అన్నారు. అయితే,   వివరాలు సేకరించేందుకే దక్షిణ కొరియా బృందానికి పోలీసులు నోటీసులిచ్చినట్లు ఏజీ శ్రీరాం హైకోర్టుకు తెలిపారు. భవిష్యత్తులో వారి అవసరం ఉంటే రావాల్సి ఉంటుందని అన్నారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, పోలీసుల అభ్యర్థన మేరకు వారు రాకపోతే హైకోర్టులో పిటిషన్ వేయవచ్చని సూచించింది. తదుపరి విచారణ ఈ నెల 26కు వాయిదా వేసింది.

Related Posts