YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆరోగ్యం తెలంగాణ

 ప్రైవేట్ ల్యాబ్ లకు ప్రభుత్వం షాక్

 ప్రైవేట్ ల్యాబ్ లకు ప్రభుత్వం షాక్

 ప్రైవేట్ ల్యాబ్ లకు ప్రభుత్వం షాక్
హైద్రాబాద్, జూన్ 27
ప్రయివేట్ ల్యాబ్‌ల్లో కరోనా టెస్టులకు బ్రేకులేసినట్లు సమాచారం. కరోనా టెస్టులు చేయొద్దని ప్రయివేట్ ల్యాబ్‌లను ప్రభుత్వం ఆదేశించిందని తెలుస్తోంది. ఐసీఎంఆర్ నిబంధనలకు విరుద్ధంగా ప్రయివేట్ ల్యాబ్‌లు కరోనా టెస్టులు చేస్తున్నాయని ప్రభుత్వం ఆరోపించిన సంగతి తెలిసిందే. పూల్ టెస్టింగ్ వల్ల కోవిడ్ లేని వారికి సైతం పాజిటివ్ అని రిపోర్ట్ వస్తోందని.. చాలా ల్యాబ్‌లు ఇరుకుగా ఉన్నాయని.. సిబ్బందికి పీపీఈ కిట్లు లేవని ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీలు తేల్చాయి.కరోనా లక్షణాలు ఉన్న వారికి మాత్రమే టెస్టులు చేయాలన్న ఐసీఎంఆర్ మార్గదర్శకాలను పట్టించుకోవడం లేదని.. టెస్టుల సంఖ్య విషయంలోనూ గందరగోళం నెలకొందని కమిటీ తెలిపింది. కరోనా టెస్టుల కోసం ప్రయివేట్ ల్యాబ్‌లకు వెళ్లే వారికి వైరస్ సోకే ముప్పు ఉందని హెచ్చరింది. ఈ నివేదిక నేపథ్యంలో ప్రయివేట్ ల్యాబ్‌ల్లో టెస్టులకు సర్కారు బ్రేకులేసిందని సమాచారం.ప్రయివేట్ ల్యాబులన్నీ కలిపి 9,577 టెస్టులు చేసినట్టు ఐసీఎంఆర్ పోర్టల్‌‌లో పేర్కొనగా.. 6,733 టెస్టులు చేసినట్టు స్టేట్‌‌ హెల్త్ పోర్టల్‌‌లో అప్‌‌లోడ్ చేశాయి. 2,076 పాజిటివ్స్ వచ్చినట్టు ఐసీఎంఆర్ పోర్టల్‌‌లో.. 2,836 పాజిటివ్‌గా తేలినట్లు హెల్త్ పోర్టల్‌‌లో అప్‌‌లోడ్ చేశాయి. ల్యాబ్ రికార్డుల్లో.. 12,700 టెస్టులు చేస్తే, 3,571 పాజిటివ్స్‌‌ వచ్చినట్టు ఉంది. ప్రయివేట్ ల్యాబులు పోర్టల్స్‌‌లో అప్‌‌లోడ్ చేసిన రికార్డులను, ల్యాబ్ ఇంటర్నల్ రికార్డులను పరిశీలిస్తే అవకతవకలు బయటపడ్డాయని ఆరోగ్య శాఖ పేర్కొంది.

Related Posts