YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆరోగ్యం తెలంగాణ

హైదరాబాద్ డేంజర్ జోన్లో ఉంది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్ డేంజర్ జోన్లో ఉంది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

న్యూ ఢిల్లీ జూలై 04 
ఢిల్లీ, ముంబై, చెన్నైలతో పాటు హైదరాబాద్ డేంజర్ జోన్లో ఉందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి హెచ్చరించారు. పాత సచివాలయాన్ని కొవిడ్ ఆసుపత్రిగా మార్చాలన్నారు. కరోనా టెస్టుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలని సూచించారు. కరోనా కట్టడి కోసం తెలంగాణకు కేంద్రం పెద్దఎత్తున సాయం చేసిందని, తెలంగాణలో బెడ్లు లేక కరోనా పేషెంట్లు ఇబ్బందులు పడుతున్నారన్న విషయం కేంద్రం దృష్టికి వచ్చిందని తెలిపారు. పాత సచివాలయంలో 3వేల బెడ్లను అందుబాటులోకి తీసుకురావొచ్చన్నారు. ఇంజినీరింగ్ కాలేజీలను కూడా ఐసోలేషన్ కేంద్రాలుగా ఉపయోగించాలని సూచించారు. లాక్డౌన్ విధించడంపై రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకుంటాయని కిషన్రెడ్డి చెప్పారు.

Related Posts