YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

కోవిద్ ఆసుపత్రిని ప్రారంభించిన మంత్రి హరీష్

కోవిద్ ఆసుపత్రిని ప్రారంభించిన మంత్రి హరీష్

సిద్దిపేట జూలై 15 
తెలంగాణా రాష్ట్ర సిద్దిపేట జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలో 100 పడకల కోవిడ్ ఆసుపత్రిని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి  హరీశ్ రావు ప్రారంభించారు. వీటిలో 80 పడకల ఆసుపత్రితో పాటు 20 పడకల ఐసీయూ కేంద్రాలు ఉన్నాయి. ఈ మేరకు కోవిడ్ ఐసోలేషన్ వార్డులలో మంత్రి కలియ తిరిగారు. కరోనా రోగులకు అందించాల్సిన వైద్యంపై వైద్యులతో కాసేపు చర్చించారు. కరోనా బారిన పడి ఆసుపత్రికి వచ్చిన రోగులకు, వైద్యుల కోసం సిద్ధంగా పెట్టిన  బల వర్థకమైన ఎనర్జీ డ్రింక్స్ వాడే విధానం, వేడి తాగునీరు అందించడం గురించి వైద్యాధికారులను ఆరా తీశారు.

Related Posts