YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

*శుభోదయం గుడి అంటే కాస్మిక్‌ ఎనర్జీ*

*శుభోదయం  గుడి అంటే కాస్మిక్‌ ఎనర్జీ*

_*◆ ఆగమశాస్త్రం ◆*_
_విశ్వంలో మనకు కనిపించని శక్తి దాన్ని *కాస్మిక్ ఎనర్జీ* అంటారు. కాస్మిక్ ఎనర్జీ అంటే *పాజిటివ్ ఎనర్జీ* మనలో వున్న చెడు ఆలోచనలను దూరంచేసి మంచి ఆలోచనలకు తోడ్పడుతుంది. మనసు ప్రశాంతంగా వుంటుంది._
_*ఈ శక్తి భూమి కింద పైన కూడా వుంటుంది !*_
_*విషయంలోకి వెళితే...* గుడి కట్టే ముందు గర్భగుడి కింద సరిగ్గా విగ్రహం పెట్టే చోట *సప్తధాతువులు* వేస్తారు. పాదరసములు, బంగారము, తగరములు, వెండి, రాగి, వీటిని సప్తధాతువులు అంటారు. అలాగే *నవరత్నాలు, పంచలోహాలు* వేస్తారు. ఇవన్నీ భూమిలో వుండే కాస్మిక్ ఎనర్జీకి రిసీవర్ గా పనిచేస్తాయి._
_*ఒక సోలార్ పవర్* ని ఎలా ఉత్పత్తి చేస్తుందో అదే విధంగా భూమిలో వుండే కాస్మిక్ ఎనర్జీని ఉత్పత్తి చేస్తాయి. ఇవి సరిగ్గా *విగ్రహం* పెట్టే పీఠం కింద వుంటాయి. తరువాత పీఠం పెట్టే ముందు పీఠం కింద *యంత్రం* పెడతారు. కింద సప్తధాతువులలో వున్న పవర్ అంతా ఈ *యంత్రంలోకి వస్తాయి.* అంతే కాక అక్కడ పలికే మంత్రాలు కూడా యంత్రంలోకి వెళతాయి. ఇది *విగ్రహం* కింద జరిగే ప్రక్రియ *గుడి పైన పూర్ణకలశం* పెట్టడం జరుగుతుంది. దాన్నే గుడి *శిఖరం* అంటారు._
_భూమి కింద వున్న శక్తిని యంత్రం ఎలా గ్రహించిందో, భూమిపైన వున్న కాస్మిక్ ఎనర్జీకి *శిఖరం రిసీవర్ గా* పనిచేచేస్తుంది. అందుకే సరిగ్గా విగ్రహం *పాదాల కింద యంత్రం తలపైన శిఖరం* వుంటేటట్లు పెట్టడం జరుగుతుంది._
_*గౌరీ పట్నం లేదా కృష్ణ శిల* ఈ రెండు రకాల రాళ్లతో తయారు చేసిన విగ్రహం పెట్టడం జరుగుతుంది. ఈ రెండు రాళ్లతో తయారు చేసిన విగ్రహమే ఎందుకు పెడతారు ? అంటే కాస్మిక్ ఎనర్జీని లాగుకునే శక్తి ఈ రెండు రాల్లకే వుంటుంది కాబట్టి ! ఈ రాళ్లు నల్లగా నీలం రంగులో ఉంటాయి. విగ్రహం కింద నుంచి యంత్రంపై నుంచి శిఖరం ఈ రెండు *కాస్మిక్ ఎనర్జీని విగ్రహం పైకి పంపిస్తాయి.* విగ్రహం మొత్తం *తరంగాల శక్తితో* నిండి ఉంటుంది. అందుకే *విగ్రహానికి* ఎదురుగా *గంట* పెట్టడం జరుగుతుంది._
_*భక్తులు* గంట కొట్టగానే ఆ ధ్వని ఆలయం లోపల అన్ని చోట్లకు చేరుతుంది. *గంట శబ్ధం* వినగానే విగ్రహం పైనున్న *శక్తి* నేరుగా గంటకు తగిలి ఆ ధ్వని చేరిన అన్ని చోట్లకు కాస్మిక్ ఎనర్జీ చేరుతుంది. అలా గుడి మొత్తం *పాజిటివ్ ఎనర్జీతో* నిండి ఉంటుంది. ఆ ఎనర్జీ భక్తులపై పడుతుంది. ఆ క్షణం భక్తులకు మనసు ప్రశాంతంగా వుంటుంది. ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అలాగే విగ్రహం దగ్గర పెట్టే తీర్థంలో కాస్మిక్ ఎనర్జీ తో కలసి వుంటుంది. ఆ ఎనర్జీ మన లోపలకు వెళితే మంచిదని తీర్థం తప్పని సరిగా తీసుకోవాలి అంటారు._
_అందుకే మనసు బాలేనప్పుడు గుడికి వెళ్ళండి అని మన *పెద్దలు* చెప్తుంటారు !_

వరకాల మురళీమోహన్ గారి సౌజన్యంతో

Related Posts