YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం దేశీయం విదేశీయం

ఎంపీలో సర్కార్ కు ఢోకాలేదు...

ఎంపీలో  సర్కార్ కు ఢోకాలేదు...

మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వం మారుతుందా? ఓటర్లు మళ్లీ కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టబెడతారా? మధ్యప్రదేశ్ ఉప ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఇదే అంశంపై ప్రధానంగా చర్చ జరిగింది. అయితే.. అలాంటి అవకాశాలకు ఛాన్సే లేదని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. మధ్యప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బందేమీ లేదని తేల్చి చెప్పాయి.
మధ్యప్రదేశ్‌లో మొత్తం 28 స్థానాలకు ఉప ఎన్నికలు జరుగగా.. బీజేపీ 17 స్థానాల్లో విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్‌ తేల్చాయి. కాంగ్రెస్ పార్టీ 11 స్థానాల్లో విజయం సాధిస్తుందని పేర్కొన్నాయి. మధ్యప్రదేశ్‌ రాష్ట్రంతో పాటు ఉప ఎన్నికలు జరిగిన ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లోనూ బీజేపీ అభ్యర్థులే విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని వెల్లడించాయి.
మధ్యప్రదేశ్‌ ఉప ఎన్నికల్లో బీజేపీ 16 నుంచి 18 స్థానాల్లో విజయం సాధిస్తుందని ఇండియా టుడ్ సర్వే వెల్లడించింది. తద్వారా శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం అధికారాన్ని నిలబెట్టుకుంటుందని ఇండియా టుడే - యాక్సిస్ మై ఇండియా  ఎగ్జిట్ పోల్ సర్వే స్పష్టం చేసింది.మధ్యప్రదేశ్‌లో గతేడాది అసెంబ్లీ ఎన్నికల అనంతరం స్వల్ప ఆధిక్యంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. పార్టీ సీనియర్ నేత కమల్‌ నాథ్ ముఖ్యమంత్రిగా కొలువుదీరారు. అయితే.. నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఈ ఏడాది (2020) మార్చి నెలలో కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ అధికారాన్ని హస్తగతం చేసుకుంది. శివరాజ్ సింగ్ చౌహాన్ వరసగా రెండోసారి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టారు.మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జ్యోతిరాధిత్య సింధియా కొంత మంది ఎమ్మెల్యేలతో బీజేపీ పార్టీలో చేరడంతో అక్కడ సంక్షోభం ఏర్పడింది. అనంతరం జరిగిన విశ్వాస పరీక్షలో కమలనాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. దీంతో అధికారం బీజేపీ హస్తగతమైంది. ఆ తర్వాత పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలందరూ తమ పదవులకు రాజీనామా చేయడంతో ప్రస్తుత ఉప ఎన్నికలు వచ్చాయి.ఈ ఏడాది మార్చి తర్వాత కాంగ్రెస్ పార్టీకి మొత్తం 26 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం 230 స్థానాలు ఉన్నాయి. అధికారం చేపట్టడానికి కావాల్సిన బలం 116 సీట్లు (మ్యాజిక్ ఫిగర్). మధ్యప్రదేశ్ అసెంబ్లీలో ప్రస్తుతం బీజేపీకి 107 మంది, కాంగ్రెస్‌కు 87 మంది శాసనసభ్యుల బలం ఉంది.అయితే.. కాంగ్రెస్‌ పార్టీ చెందిన ఓ ఎమ్మెల్యే అక్టోబర్‌లో రాజీనామా చేశాడు. ఆ స్థానానికి ఉప ఎన్నికల నిర్వహణపై ఈసీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ కారణంగా మధ్యప్రదేశ్‌ అసెంబ్లీలో సభ్యుల సంఖ్య ప్రస్తుతం 229కి తగ్గింది. దీంతో మ్యాజిక్ ఫిగర్ 115కి మారింది. ఉపఎన్నికల్లో బీజేపీకి 8 సీట్లు వస్తే చాలు.. ఆ పార్టీ అధికారాన్ని నిలబెట్టుకుంటుంది. ఇక కాంగ్రెస్ తిరిగి అధికారాన్ని దక్కించుకోవాలంటే 28కి 28 స్థానాల్లో విజయం సాధించాలి. ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు నవంబర్ 10న జరుగుతుంది. ఆ రోజు మధ్యాహ్నం వరకు ఫలితం తేలనుంది.

Related Posts