YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు దేశీయం

యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం..పద్నాలుగు మంది మృతి

యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం..పద్నాలుగు మంది మృతి

లక్నో నవంబర్ 20, 
ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రతాప్ ఘడ్ లో గురువారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు పిల్లలతో సహ పద్నాలుగు మంది దుర్మరణం పాలయ్యారు. ప్రయాగ్ రాజ్ – లక్నో రహాదారిపై దేశ్రాజ్ ఈనారా ప్రాంతంలో మృతులు ప్రయాణిస్తున్న కారు ఒక లారీని వెనకనుంచి ఢికొనడంతో ఘటన జరిగింది. లారీ టైరు పంచరు కావడంతో రోడ్డు పక్కన ఆపివుంచారు. ఆ లారీని మహింద్రా బోలెరో వెనుకనుంచి బలంగా ఢికొట్టింది.  కారు ముందుభాగం లారీకిందకు దూసుకుపోయింది.  సమీప గ్రామం కుంద లో జరిగిన ఒక వివాహ వేడుకకు హజరయిన వారంతా కారులో తిరిగివస్తుండంగా ఈ ప్రమాదం జరిగింది.

Related Posts