YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

వ్యాక్సిన్ పంపిణీకి సిద్ధం : సీఎం కేసీఆర్

వ్యాక్సిన్ పంపిణీకి సిద్ధం : సీఎం కేసీఆర్

హైద‌రాబాద్ నవంబర్ 24 
 కొవిడ్‌ వ్యాక్సిన్‌ను ప్రాధాన్యతాక్రమంలో అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు తెలిపారు. పలు రాష్ర్టాల సీఎంలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులతో ప్రధాని మోదీ నేడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వ్యాక్సిన్ వచ్చిన తర్వాత వాటిని ప్రజలకు అందించే విషయంలో అనుసరించాల్సిన విధానంపై ప్ర‌ధాని చర్చించారు.  ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. శాస్త్రీయంగా ఆమోదింపబడిన వ్యాక్సిన్‌ను ప్రజలకు అందించే విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. వ్యాక్సిన్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అనే విషయాన్ని నిర్ధారించుకోవాల్సిన అవసరం కూడా ఉందన్నారు. వ్యాక్సిన్ కోసం ప్రజలంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారన్నారు. శాస్త్రీయంగా ఆమోదించబడిన వ్యాక్సిన్ రావాల్సిన అవసరం ఉందన్నారు. వ్యాక్సిన్ పంపిణీకి అనుగుణమైన కార్యాచరణను రూపొందించిన‌ట్లు తెలిపారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో వేర్వేరు వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. కరోనా వైరస్ కూడా దేశమంతటి పైనా ఒకే రకమైన ప్రభావం చూపలేదు. వ్యాక్సిన్ కూడా ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన సైడ్ ఎఫెక్ట్స్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టీ మొదట రాష్ట్రానికి కొన్ని చొప్పున వ్యాక్సిన్ డోసులు పంపి వాటిని కొంతమందికి ఇవ్వాలి. పది, పదిహేను రోజులు పరిస్థితిని పరిశీలించి తర్వాత మిగతా వారికి ఇవ్వాలన్నారు. ముఖ్యమంత్రితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ముర్తజా రజ్వీ, మెడికల్ హెల్త్ డైరక్టర్ శ్రీనివాస రావు, మెడికల్ ఎడ్యుకేషన్ డైరక్టర్ రమేష్ రెడ్డి, హెల్త్ యూనివర్సిటి వీసీ కరుణాకర్ రెడ్డి, కోవిడ్ నిపుణులు కమిటీ సభ్యుడు గంగాధర్ తదితరులు స‌మావేశంలో పాల్గొన్నారు.

Related Posts