YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

రాష్ట్రాభివృద్ధికి పర్యాటక, పరిశ్రమరంగాలే పట్టుగొమ్మలు - : పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

రాష్ట్రాభివృద్ధికి పర్యాటక, పరిశ్రమరంగాలే పట్టుగొమ్మలు - : పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

విశాఖపట్నం జనవరి 21 
రాష్ట్రాభివృద్ధికి పర్యాటక, పరిశ్రమరంగాలే పట్టుగొమ్మలని   పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. ఉత్తరాంధ్రలో ఊహించని స్థాయిలో పారిశ్రామిక, పర్యాటకాభివృద్ధి వుంది. ఫిబ్రవరిలో సీఐఐ ఆధ్వర్యంలో భారీ పారిశ్రామిక సదస్సు నిర్వహిస్తామని అన్నారు. పరిశ్రమలు, పర్యాటక రంగాల అభివృద్ధి లక్ష్యంగా త్వరలో అంతర్జాతీయ స్థాయి పర్యటన. తేదీల వివరాలు  ప్రకటిస్తాం. రూ.5,500 వేల కోట్ల ఖర్చుపెట్టి రక్షణ, భద్రత ప్రమాణాలతో రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్నెట్ సౌకర్యం కల్పించబోతున్నాం. మెడ్ టెక్ జోన్ అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం, అత్యద్భుత వైద్య రంగ తయారీ పరికరాలకు చిరునామా గా వుంటుంది. మెడ్ టెక్ జోన్ తో ఆర్టీపీసీఆర్ సహా ప్రజలకు మరింత సులువుగా వైద్యసేవలు, చౌకగా వైద్య పరికరాల తయారీ అవుతాయి. కచ్చితంగా ప్రపంచంతో పోటీ పడే వైద్య పరికరాల తయారీ యూనిట్ గా ఏపీఎమ్ జెడ్ నిలుస్తుంది. పాలనా రాజధానిగా  ముఖ్యమంత్రి విశాఖను  ప్రకటించిన నేపథ్యంలో మరింత వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి రకరకాల సంస్కరణలతో వ్యవస్థల బలోపేతానికై ప్రభుత్వ కృషి చేస్తోంది. అందువల్ల రాష్ట్రంలో పెట్టుబడులకు మంచి వాతావరణం ఏర్పడింది. జపాన్, తైవాన్ దేశాల తయారీ కంపెనీలు ఏపీకి క్యూ కడుతున్నాయి. కోవిడ్ నేపథ్యంలో ఐ.టి రంగంలో వర్క్ ఫ్రమ్ హోమ్ కి ప్రాధాన్యత ఏర్పడింది. అందుకే పల్లె పల్లెలోని ఇంటింటికీ ఇంటర్నెట్ అందించనున్నాం. విశాఖలో ఐ.టీ, సంబంధిత సేవలను మరింత విస్తరిస్తాం. వలస కార్మికులను, వలసపోయిన వారందరినీ తిరిగి ఏపీకి రప్పిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా 'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' జరుగుతున్న తీరుపై దృష్టి పెట్టాం. జిల్లాల వ్యాప్తంగా అధికార యంత్రాంగాన్ని ఒక తాటిపై తీసుకువచ్చి సత్వర పరిష్కారానికి చర్యలు చేపడాతామని అయన అన్నారు.

Related Posts