YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

ఏపీకి కేంద్రం మరో 496 కోట్లు

ఏపీకి కేంద్రం మరో 496 కోట్లు

ఏపీకి కేంద్రం మరో 496 కోట్లు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6
జగన్ సర్కార్‌కు కేంద్రం శుభవార్త చెప్పింది. రెవెన్యూలోటుతో ఉన్న 14 రాష్ట్రాలకు 11వ విడతగా రూ.6,195 కోట్లను కేంద్రం గ్రాంటు రూపంలో విడుదల చేసింది. ఏపీకి రూ.491.42 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థికశాఖ శుక్రవారం 
తెలిపింది. ఏపీతో పాటూ అసోం, హిమాచల్ ప్రదేశ్, కేరళ, మణిపూర్, మేఘాలయా, మిజోరాం, నాగాలాండ్, పంజాబ్, సిక్కిం, తమిళనాడు, త్రిపుర, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్‌లు ఉన్నాయి. ఆర్థికంగా కష్టకాలంలో ఇది ఓ విధంగా 
రిలీఫ్ అని చెప్పాలి.మరోవైపు కరోనా కట్టడి కోసం ఏపీకి రూ.324.27 కోట్లు ఇచ్చామని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్‌ చౌబే తెలిపారు. లోక్‌సభలో వైసీపీ ఎంపీలు అవినాష్ రెడ్డి, రఘురామకృష్ణంరాజు అడిగిన
ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. అయితే సరైన డాక్యుమెంట్లు అందించనందున ఉజ్వల, స్వధార్‌ పథకాల కింద ఏపీకి నిధులు విడుదల చేయలేదని కేంద్ర మహిళా, శిశు శాఖ మంత్రి స్మృతీ ఇరానీ చెప్పారు.

Related Posts