YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం దేశీయం విదేశీయం

మేకిన్ ఇండియా అడుగులపై గుర్రు

మేకిన్ ఇండియా అడుగులపై గుర్రు

న్యూఢిల్లీ, మార్చి 3, భారత్‌లో ఇతర దేశాల నుంచి దిగుమతికి ప్రత్యమ్నాయంగా ప్రవేశపెట్టిన ‘మేక్ ఇన్ ఇండియా’ వల్ల అమెరికా, భారత్ల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలు సవాళ్లను ఎదుర్కొంటుందని బైడెన్ పరిపాలన అధికారులు యూఎస్ కాంగ్రెస్‌కు మంగళవారం ఓ నివేదిక ద్వారా తెలిపింది. 2021 ట్రేడ్ పాలసీ ఎజెండా, 2020 వార్షిక నివేదిక, యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ (యూఎస్టీఆర్)2020లో యూఎస్ ఎగుమతిదారులు, సుదీర్ఘ కాలంగా ఎగుమతిదారులను ప్రభావితం చేస్తున్న యాక్సెస్ అడ్డంకులను పరిష్కరించడానికి ప్రయత్నిస్తూనే.. భారత్‌తో తన ద్వైపాక్షిక సంబంధాలను కొనసాగించిందని అధికారులు నివేదికలో చెప్పారు. భారత్ మార్కెటింగ్ అతిపెద్దది. ఆర్థికవృద్ధి, అభివృద్ధి వైపు పురోగతికి సంబంధించి ఎగుమతిదారులకు ఇది ముఖ్యమైన మార్కెట్‌గా మారినప్పటికీ, వాణిజ్య నియంత్రణ విధానాల వల్ల సాధారణ, స్థిరమైన ధోరణి వల్ల ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాల సామర్థ్యాన్ని దెబ్బతీస్తోందని యూఎస్‌టీఆర్ సోమవారం కాంగ్రెస్‌కు ఇచ్చిన నివేదికలో తెలిపింది.2019 జూన్ 5 యూనైటెడ్ స్టేట్స్ సిస్టం ఆఫ్ ప్రిఫరెన్స్ (జీఎస్పీ) ప్రోగ్రాం కింద భారత అర్హతను తన జాబితా నుంచి రద్దు చేసింది. జీఎస్పీ నిర్ణయం తరువాత భారత్ మేక్ ఇన్ ఇండియా విధానాన్ని అవలంభించిందని తెలిపారు. దీని తర్వాత 2019లో కూడా భారత్ యూఎస్‌లు మంచి మార్కెటింగ్ ఉత్పత్తి సాధించడానికి తీవ్రంగానే కృషి చేశాయి. ఈ భాగస్వామ్యం 2020 వరకు కొనసాగిందని తెలిపింది. ఇంకా నివేదికలో యూఎస్ లక్ష్యాల్లో వివిధ సుంకాలు, అడ్డంకులను పరిష్కరించడానికి భారతకు విధించే సుంకాలను కొన్నింటిని తగ్గించి, ఇతర మార్కెట్ యాక్సెస్ మెరుగుదల గురించి వివరించారు. 2020లో ఆందోళనగానే మెధో సంపత్తి, రక్షణ అమలుకు, ఎలక్ట్రానిక్, డిజిటల్ వాణిజ్యాన్ని ప్రభావితం చేసే ద్వైపాక్షిక వాణిజ్య సమస్యలను ప్రతిస్పందిస్తూనే వ్యవసాయ, వ్యవసాయేతర ఎగుమతుల వ్యాపారం చేసిందని తెలిపింది.యూటీఐఆర్ నివేదికలో అతిపెద్ద సేవల సరఫరాదారు యూనైటెడ్ కింగ్ డమ్ అని పేర్కొంది, 2019లో యూఎస్ సేవల దిగుమతుల్లో 62.3 బిలియన్ డాలర్లు, కెనడా 38.6, జపాన్ 35.8 తరువాత భారత్ 29.7 బిలియన్ డాలర్లతో 6వ అతిపెద్ద దేశంగా ఉందని తెలిపింది.ఈ నేపథ్యంలో యూటీఐఆర్ మాట్లాడుతూ..2020 జూలైలో భారతదేశం పాలవిరుగుడుకు ఉపయోగించే లాక్టోజ్‌ను ఎగుమతిని ప్రారంభించింది. 2020 ఏప్రిల్ నుంచి అమెరికా దీన్ని నిషేధించారు. ఆ ఉత్పత్తులకు నాణ్యత ధ్రువీకరణతోపాటు భారత్‌ తమ దేశంలో అమలు చేయడం ప్రారంభించింది. ఈ నిషేధానికి ముందు భారత్ అమెరికాల భాగస్వామ్యం ఏళ్లకొద్ది జరిగింది. 2020లో సుమారు 32 మిలియన్ డాలర్లకు పడిపోయే ముందు 2019లో సుమారు 54 మిలియన్ డాలర్ల ద్వైపాక్షిక భాగస్వామ్యం చేసిందని తెలిపింది..

Related Posts