YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

భారతీయ రైల్వేలను ప్రైవేటీకరించం: కేంద్ర మంత్రి పియూష్‌ గోయల్‌

భారతీయ రైల్వేలను ప్రైవేటీకరించం: కేంద్ర మంత్రి పియూష్‌ గోయల్‌

న్యూఢిల్లీ మార్చ్ 16
భారతీయ రైల్వేలను ప్రైవేటీకరించడం జరుగదని కేంద్ర మంత్రి పియూష్‌ గోయల్‌ స్పష్టం చేశారు. రైల్వేలు సదా భారత ప్రభుత్వంతోనే ఉంటాయని మంగళవారం చెప్పారు. ‘రైల్వేలను ప్రైవేటీకరించినట్లు మాపై ఆరోపణలు ఉన్నాయి. కానీ, ప్రభుత్వ వాహనాలు మాత్రమే రోడ్లపై నడపాలని ప్రజలు ఎప్పుడూ అనరు. ఎందుకంటే ప్రైవేట్, ప్రభుత్వ వాహనాలు రెండూ ఆర్థికంగా సహాయపడతాయి. రైల్వేలో పెడుతున్న ప్రైవేట్ పెట్టుబడులు ఇక్కడ సేవలను మరింత మెరుగు పరుస్తాయనే ఉద్దేశంతోనే మనం స్వాగతించాలి" అని గోయల్ చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో దేశ రైల్వే మౌలిక సదుపాయాలు కొత్త విజన్‌ను చూశాయని, రైల్వే ఆర్థిక వ్యవస్థ అన్ని రంగాలకు సమృద్ధిని తీసుకొచ్చినట్లు లోక్‌సభలో రైల్వే గ్రాంట్స్ డిమాండ్లపై చర్చకు సమాధానమిస్తూ పియూష్‌ గోయల్ చెప్పారు.
‘భారత రైల్వేలు దేశానికి ‘వృద్ధికి ఇంజిన్’గా పనిచేయాలని మేం కోరుకుంటున్నాం. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌లో రైల్వేల అభివృద్ధి కోసం రూ.2 లక్షల కోట్లకు పైగా కేటాయించాం’ అని పియూష్‌ గోయల్‌ తెలిపారు. మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు ఎలాంటి ప్రాజెక్టులను అమలు చేయకుండా కంటితుడుపు ప్రకటనలు చేశారని గత ప్రభుత్వంపై ఆయన నిందలు మోపారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు కలిసి పనిచేసినప్పుడే దేశం మరింత వృద్ధి వైపు పయనించగలదని, మరిన్ని ఉపాధి అవకాశాలను సృష్టించగలదని మంత్రి అన్నారు. రెండేండ్లలో రైలు ప్రమాదం కారణంగా ఏ ఒక్క ప్రయాణికుడు చనిపోలేదని, ప్రయాణికుల భద్రతపై రైల్వే అధికంగా దృష్టి సారిస్తున్నదని చప్పారు. రైలు ప్రమాదం కారణంగా చివరి మరణం 2019 మార్చిలో జరిగింది అని మంత్రి పియూష్‌ గోయల్‌ వెల్లడించారు

Related Posts