YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి ఆరోగ్యం ఆంధ్ర ప్రదేశ్

ఏపీలో ఏప్రిల్ 1 నుంచి ఒంటిపూట బడులు మంత్రి ఆదిమూలపు

ఏపీలో ఏప్రిల్ 1 నుంచి ఒంటిపూట బడులు మంత్రి ఆదిమూలపు

ఏపీలో ఏప్రిల్ 1 నుంచి ఒంటిపూట బడులు
మంత్రి ఆదిమూలపు
అమరావతి మార్చ్ 22 
రాష్ట్రంలో ఏప్రిల్ 1 నుంచి ఒంటిపూట బడులు వుంటాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. 1 నుంచి 10 తరగతి విద్యార్థులకు ఒక్కపూటే తరగతులు వుంటాయి. ఉదయం 7.45 నుంచి 11.30 వరకు తరగతులు.. తరువాత మధ్యాహ్న భోజనం వుంటుందని అన్నారు. పాఠశాల నుంచి విద్యార్థులు క్షేమంగా ఇళ్లకు చేర్చటంపై ఉపాధ్యాయులు శ్రద్ద తీసుకోవాలి. ఎండలు, కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా ఈ నిర్ణయం. పాఠశాలల్లో కోవిడ్ నిబంధనలు అమలుపై అధికారులకు ఆదేశాలు ఇచ్చామని అన్నారు. విద్యార్థులకు కోవిడ్ పరీక్షలు నిర్వహణ, మాస్క్ లు ధరించడం, శానిటైజర్ వినియోగం, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి  ఆదేశించారు. 

Related Posts