YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

3 లక్షల కోట్లా... 32 వేలు ఎక్కడా...

 3 లక్షల కోట్లా... 32 వేలు ఎక్కడా...

విశాఖపట్టణం, మార్చి  24, 
విశాఖ ఉక్కు కర్మాగారం అంటే తూర్పు తీరానికి పెట్టని కోట అని అంతా అనుకున్నారు. అది ఉక్కు కాదు తుక్కు కింద తెగనమ్ముకోవచ్చు అని నేటి నేతలు రుజువు చేస్తున్నారు. విశాఖ ఉక్కుని ప్రజల సెంటిమెంట్ గా చూడడంలేదు. త్యాగాల పునాదులపైన ఏర్పడిన ప్లాంట్ గా కూడా అసలు భావించడంలేదు. ఇవన్నీ కాదనుకున్నా దేశంలో అత్యంత ఖరీదైన కర్మాగారంగా అయినా చూస్తున్నారా అంటే అది కూడా లేదు అని తేలిపోతోంది. విశాఖ ఉక్కు విలువ మరీ అంత తక్కువా అన్నది కూడా ఇపుడు ఉద్యమకారుల మరో ఆవేదనగా ఉంది.విశాఖ ఉక్కు కర్మాగారం దాదాపుగా పాతిక వేల ఎకరాల్లో ఉంది. ఇందులో 18 వేల ఎకరాలను వినియోగించినా కూడా ఇంకా ఏడు వేల ఎకరాల భూమి భవిష్యత్తు అవసరాల కొరకు మిగిలి ఉంది. మొత్తానికి మొత్తం ఎకరాలను కనుక ప్రస్తుత‌ మార్కెట్ విలువకు లెక్క కడితే రెండున్నర లక్షల కోట్ల రూపాయల వరకూ ఉంటుంది. అతే కాదు అక్కడ ఉన్న ఇతర స్థిర చరాస్తుల విలువ అంచనా కట్టినా కూడా మూడు లక్షల కోట్లకు తక్కువ లేదు అంటారు. అలాంటిది కేంద్రం కట్టిన విలువ కేవలం 32 వేల కోట్ల రూపాయలు మాత్రమే. అంటే అసలు విలువలలో కేవలం పదవ వంతు అన్న మాట. ఇంతకంటే కారు చౌక బేరం ఉంటుందా అన్నదే అందరి ప్రశ్న. ఉక్కు కర్మాగారాన్ని కొనుగోలు చేసే కామందులు ఆసాములు ఎవరైనా చేసేది మాత్రం అచ్చమైన రియల్ ఎస్టేట్ వ్యాపారమే అని అంటున్నారు. అయిదు దశాబ్దాల క్రితం విశాఖ భూముల ధరలు నామమత్రంగా ఉన్నాయి. పైగా విశాఖకు స్టీల్ ప్లాంట్ అపుడు కడు దూరం. కానీ నేడు మెగా సిటీగా విశాఖ ఉంది. దాంతో నడి మధ్యకు స్టీల్ ప్లాంట్ వచ్చేసింది. ఇక ఆసియా ఖండంలోనే అత్యంత వేగంగా విశాఖ అభివృద్ధి చెందుతోంది. పాలనా రాజధాని కూడా కాబోతోంది. దాంతో భూముల విలువ అంతకంతకు పెరిగేదే కానీ తరిగేది కాదు. ఇక కారు చవకగా కొన్న వారు ఎవరైనా జాక్ పాట్ కొట్టేసినట్లే అని అర్ధిక నిపుణులు కూడా అంటున్నారు. వారు ఉక్కు పరిశ్రమను నడుపుతారో లేదో తెలియదు కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకున్నా లక్షల కోట్లు చేతుల్లోకి వచ్చిపడతాయి అంటున్నారు.విశాఖ ఉక్కుని తుక్కు మాదిరిగా చేసి దారుణమైన రేటుని పెద్దలు అస్మదీయులకే అప్పచెబుతారు అంటున్నారు. మరి ఇందులో లాభనష్టాలు లోపాయికారీ ఒప్పందాలు అన్నీ కూడా పరమాత్ముడికే ఎరుక అని కూడా చెప్పుకోవాలి. అయితే ఉక్కు కర్మాగారం స్థాపన నాడు నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఇచ్చిన మాట ఏంటి అంటే భూములు ఇచ్చి నిర్వాసితులుగా మారిన వారికి ప్రతీ కుటుంబంలో ఒకరికి స్టీల్ ప్లాంట్ లో జాబ్ ఇస్తామని. కానీ మొత్తం 20 వేల మందిలో కేవలం ఎనిమిది వేల మందికే ఇప్పటిదాకా ఉద్యోగాలు ఇచ్చారు. మిగిలిన వారి సంగ‌తేంటి, ఇపుడు ప్రైవేటీకరణతో మొత్తం ఉద్యోగాలు పోతున్న వారి సంగతేంటి అన్నది కూడా ఒక చర్చ. అయితే ఎటూ తెగనమ్మాలనుకుంటే ఆ భూముల విలువ ప్రకారం వాటాదారులు ఎవరున్నారో వారందరినీ నష్టపరిహారం చెల్లించాల్సిందే అన్న డిమాండ్ కూడా వస్తోంది. మరి దీనికైనా పాలకులు ఒప్పుకుంటారా.
రాజీనామా డిమాండ్
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ ఉద్యమం రోజురోజుకూ ఊపందుకుంటుంది. కేంద్ర ప్రభుత్వం మాత్రం ప్రయివేటీకరణకు మొండిగా ముందుకు వెళుతుంది. కానీ రాజకీయ పార్టీలు మాత్రం ఒకరిపై ఒకరు దుమ్మెత్తు కోవడానికే సమయాన్ని వెచ్చిస్తున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా రాజీనామాలు చేయాలన్న డిమాండ్ రోజురోజుకూ పెరుగుతుంది. ప్రధానంగా విశాఖపట్నం ప్రాంతానికి చెందిన వారిపై ఈ ఒత్తిడి ఎక్కువగా ఉంది.ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తన పదవికి రాజీనామా చేశారు. కానీ గంటా శ్రీనివాసరావు తమ పార్టీ అని చెప్పుకునేందుకు టీడీపీ సిద్ధంగా లేదు. వైసీపీ ఎంపీలందరూ రాజీనామా చేయాలని టీడీపీ డిమాండ్ చేస్తుంది. అయితే వైసీపీ మాత్రం రాజీనామాలతో ప్రయోజనం ఏముంటుందని ప్రశ్నిస్తుంది. పదవుల్లో ఉండి పోరాడితేనే ఫలితం దక్కుతుందని విజయసాయిరెెడ్డి వంటి నేతలు బాహాటంగానే చెబుతున్నారు.అయితే మూడు సంవత్సరాలు వెనక్కు వెళితే ప్రత్యేక హోదా కోసం జగన్ తన పార్టీ ఎంపీల చేత రాజీనామా చేయించారు. అప్పుడు వైసీపీ ప్రతిపక్షంలో ఉంది. అధికారంలో ఉన్న అప్పటి టీడీపీ ఎంపీలను కూడా రాజీనామా చేయాలని విపక్ష నేతగా జగన్ అప్పుడు డిమాండ్ చేశారు. కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం రాజీనామాలకు సిద్ధపడలేదు. వైసీపీ ఎంపీలు ఎన్నికలకు ముందు రాజీనామాలు చేయడంతో హోదా విషయంలో పెద్దగా వర్క్ అవుట్ కాలేదు.ఇప్పుడు అదే పరిస్థితిలో టీడీపీ ఉంది. టీడీపీ రాజీనామాలకు డిమాండ్ చేస్తుంటే వైసీపీ మాత్రం ససేమిరా అంటుంది. ప్రధానంగా విశాఖ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలపై ఈ ఒత్తిడి అధికంగా ఉంది. రాజీనామాళ్ల సవాళ్లు తప్పించి ఏపీలో విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఎలా పరిరక్షించుకుందామన్న స్పృహ ఏ రాజకీయ పార్టీలోనూ కన్పించడం లేదు. మొత్తం మీద అప్పుడు ప్రత్యేక హోదా, ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో రాజీ డ్రామాలు కొనసాగుతూనే ఉన్నా

Related Posts