YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

ఆదానీకి గంగవరం పోర్టు

ఆదానీకి గంగవరం పోర్టు

విశాఖపట్టణం, మార్చి 24, 
గంగవరం పోర్టులో మెజార్టీ వాటాలను అదానీ గ్రూప్ దక్కించుకుంది. అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ తాజాగా గంగవరం పోర్టులో 58.1 శాతం వాటాను కొనుగోలు చేస్తోంది. డీవీఎస్ రాజు, ఆయన కుటుంబానికి చెందిన 58.1 శాతం వాటాను అదానీ పోర్ట్స్ రూ.3,604 కోట్లకు కొనుగోలు చేస్తోంది. ఇప్పటికే ఈ పోర్టు కంపెనీలోని 31.5 శాతం వాటాను రూ.1,954 కోట్లకు వార్‌బర్గ్ పింకస్ అనుబంధ సంస్థ.. విండీ లేక్ సైడ్ ఇన్వెస్ట్‌మెంట్ లిమిటెడ్ నుంచి కొనుగోలు చేసేందుకు అదానీ గ్రూప్ ఒప్పందం చేసుకుంది. ఈ రెండు ఒప్పందాలు పూర్తయితే గంగవరం పోర్టులో అదానీ గ్రూప్ వాటా 89.6 శాతానికి చేరుతుంది.వైజాగ్ పోర్టుకు చేరువగా ఉండే గంగవరం పోర్టు రాష్ట్రంలో రెండో అతిపెద్ద నాన్ మేజర్‌ పోర్టుగా ఉంది. 64 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యం దీని సొంతం. ఈ మల్టీ పర్పస్ పోర్టు లోతుగా ఉండటంతోపాటు అన్ని కాలాల్లో వాడటానికి అనువుగా ఉంటుంది. ప్రస్తుతం గంగవరం పోర్టులో 9 బెర్తులు ఉండగా.. 250 మిలియన్ మెట్రిక్ టన్నుల సరకు రవాణాకు వీలుగా.. 31 బెర్తులకు విస్తరించేలా మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నారు.గంగవరం పోర్టులో వాటాల కొనుగోలు ప్రక్రియ ఆరు నెలల్లో పూర్తయ్యే అవకాశం ఉందని అదానీ పోర్ట్స్ తెలిపింది. గంగవరం పోర్ట్ ప్రయివేట్ లిమిటెడ్ ద్వారా డ్రై బల్క్, బ్రేక్ బల్క్ కార్గో ఎగుమతి దిగుమతులు జరపొచ్చు. బొగ్గు, ఇనుప ఖనిజం, ఎరువులు, సున్నపురాయి, బాక్సైట్, పంచదార, అల్యూమినియం, ఉక్కు తదితరాల ఎగుమతులు, దిగుమతులు సాగుతున్నాయి. భారత్‌లోని ఎనిమిది రాష్ట్రాల నుంచి గంగవరం పోర్టుకు సరకు రవాణా సాగుతోంది.

Related Posts