YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వాణిజ్యం తెలంగాణ

త్వరలో ఆర్టీసీ ఉద్యోగుల‌కు వేత‌నాలు పెంపు: కేసీఆర్

త్వరలో ఆర్టీసీ ఉద్యోగుల‌కు వేత‌నాలు పెంపు: కేసీఆర్

తెలంగాణ ఉద్య‌మంలో అండ‌గా నిలిచి రాష్ర్ట సాధ‌న‌లో భాగ‌స్వాములైన ఆర్టీసీ ఉద్యోగుల ‌కు కేసీఆర్ శుభ‌వార్త వినిపించారు.శాస‌న‌స‌భ‌లో ద్రవ్య వినిమ‌య బిల్లుపై చ‌ర్చ సంద‌ర్భంగా సీఎం మాట్లాడారు. తెలంగాణ ఉద్య‌మంలో అన్ని ఉద్యోగ సంఘాలు పోరాటం చేశాయి. ఆర్టీసీ ఉద్యోగుల పాత్ర మ‌ర‌వ‌లేనిది. ఆర్టీసీ ఉద్యోగులు భ‌య‌ప‌డాల్సిన అవ‌సరం లేదు. ఆర్టీసీని కాపాడుతున్నాం. బ‌డ్జెట్‌లో రూ. 3000 కోట్లు కేటాయించాం. ప్ర‌తి నెల నిధులు విడుద‌ల చేస్తున్నాం. ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు పెంచిన‌ట్లే.. ఆర్టీసీ ఉద్యోగుల‌కు కూడా వేత‌నాలు పెంచుతాం. ర‌వాణా శాఖ మంత్రితో త్వ‌ర‌లోనే చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకుంటాం. ఈ విష‌యంలో ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌సరం లేద‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.

Related Posts