YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం విద్య-ఉపాధి తెలంగాణ

టీఎస్ పీఎస్సీ నియామకంపై కసరత్తు

టీఎస్ పీఎస్సీ నియామకంపై కసరత్తు

హైదరాబాద్, మార్చి 30,
తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఛైర్మన్‌తోపాటు ఇతర సభ్యుల నియామకంపై కసరత్తు ఎక్కడి వరకు వచ్చింది? పరిశీలనలో ఉన్న పేర్లకు ఓకే చెబుతారా? మరో ఉద్యోగ సంఘం నేతకు చోటు దక్కబోతుందా? తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఛైర్మన్‌ పదవి గత ఏడాది డిసెంబర్‌లో ఖాళీ అయింది. కమిషన్‌లో ప్రస్తుతం ఒక్కరే సభ్యుడుగా ఉన్నారు. ఈ పోస్టులను ప్రభుత్వం ఎప్పుడైనా భర్తీ  చేయొచ్చన్న ప్రచారం జరుగుతోంది.  వివిధ కార్పొరేషన్లు.. నామినేటెడ్‌ పోస్టుల నియామకాలు చేపట్టాలని సర్కార్‌ నిర్ణయించడంతో.. ఆ జాబితాలో తెలంగాణ పబ్లిక సర్వీస్‌ కమిషన్‌ కూడా ఉంటుందని చెబుతున్నారు. ఛైర్మన్‌ సహా సభ్యుల ఎంపికపై ఫోకస్‌ కూడా పెట్టారట. రాష్ట్రంలో భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీ చేపట్టాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. వివిధ ప్రభుత్వ విభాగాలలో ఉన్న ఖాళీల చిట్టా తెప్పించుకుంటోంది. పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా నియామకాలు చేపట్టాల్సి ఉంటే.. ముందుగా టీఎస్ పీసీని పూర్తిస్థాయిలో బలోపేతం చేయాల్సి ఉంటుంది. ఛైర్మన్‌ ఇతర సభ్యులు ఉంటేనే కొత్త నోటిఫికేషన్లకు మార్గం సుగమం అవుతుంది. ఇప్పటికే టీఎస్పీసీసీ  ఛైర్మన్‌ పోస్ట్‌పై ఒక మాజీ పోలీస్‌ అధికారి సహా అనేకమంది పేర్లు చర్చలోకి వచ్చాయి. ఈసారి కూడా పబ్లిక్‌ సర్వీస్ కమిషన్‌ సభ్యుడిగా టీఎన్జీవోఉద్యోగ సంఘం మాజీ నేతకు అవకాశం ఉంటుందని ప్రచారం జరుగుతోంది. టీఎన్జీవో అధ్యక్షులుగా పనిచేసిన స్వామిగౌడ్‌, దేవీప్రసాద్‌లకు పదవులు దక్కాయి. స్వామిగౌడ్‌ ప్రస్తుతం బీజేపీకి వెళ్లిపోయారు. వీరిద్దరి తర్వాత అధ్యక్షుడిగా పనిచేసిన కారెం రవీందర్‌కు ఎలాంటి పోస్ట్‌ దక్కలేదు.  శ్రీనివాస్‌గౌడ్‌ను సైతం కేబినెట్‌లోకి తీసుకున్నారు. ప్రస్తుతం కారెం పేరు ఉద్యోగ సంఘాల్లో చర్చకు వస్తోంది. ఆయన కూడా ఇటీవలే సీఎం కేసీఆర్‌ను కలిశారట. సీఎంఓలో బయోడేటా అందజేసినట్టు చెబుతున్నారు. మొన్నటి వరకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడిగా ఉద్యోగ  సంఘం నేత విఠల్‌ పనిచేశారు. ఇప్పుడు ఆ ప్లేస్‌లో రవీందర్‌కు ఛాన్స్‌ ఇస్తారని అనుకుంటున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో టీఎన్జీవోసీఎం కేసీఆర్‌ ప్రశంసించిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. ఇవన్నీ పరిశీలించిన ఉద్యోగులు ఈ దఫా కారెం వంతు వస్తోందని లెక్కలు వేసుకుంటున్నారు. అయితే ఆ ప్రకటన ఎప్పుడో వేచి చూడాలి.

Related Posts