YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

నేటి నుండి పాఠశాలలకు ఒంటిపూట బడులు... ఎంఈఓ రమా వెంకటేశ్వర్లు

నేటి నుండి పాఠశాలలకు ఒంటిపూట బడులు... ఎంఈఓ రమా వెంకటేశ్వర్లు

నేటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలకు ఒంటిపూట బడులను నిర్వహిస్తున్నట్టు తుగ్గలి మండల విద్యాధికారి రమా వెంకటేశ్వర్లు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ మరియు వేసవి కాలం దృష్టిలో ఉంచుకొని పాఠశాలల అన్నింటికీ ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలియజేశారు.రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నట్టు ఎంఈవో తెలియజేశారు.పాఠశాలలు ఉదయం 7:45 నిమిషాలకు ప్రారంభమై,మధ్యాహ్నం 12:30 గంటలకు ముగుస్తాయని ఎంఈఓ రమా వెంకటేశ్వర్లు తెలియజేశారు.తల్లిదండ్రులు విద్యార్థులకు మాస్కులు వేసి పాఠశాలలకు పంపించాలని  ఎంఈఓ తెలియజేశారు.

Related Posts