YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

హోమ్‌లోన్‌ పై వ‌డ్డీ రేటు పెంచిన ఎస్‌బీఐ

హోమ్‌లోన్‌ పై వ‌డ్డీ రేటు పెంచిన ఎస్‌బీఐ

న్యూఢిల్లీ  ఏప్రిల్ 5, 
దేశంలోని అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) హోమ్‌లోన్ల‌పై వ‌డ్డీరేటును పెంచింది. మార్చి 31 వ‌ర‌కూ అతి త‌క్కువ వ‌డ్డీ రేటు (6.7 శాతం)కు హోమ్‌లోన్ అందించిన ఎస్‌బీఐ.. ఆ గ‌డువు ముగియ‌డంతో వ‌డ్డీరేటును 6.95 శాతానికి పెంచింది. ఈ కొత్త వ‌డ్డీరేట్లు ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి వ‌చ్చిన‌ట్లు ఆ బ్యాంకు త‌న వెబ్‌సైట్‌లో వెల్ల‌డించింది. ఇంత వ‌ర‌కూ ఎస్‌బీఐను చూసి వ‌డ్డీ రేట్లు త‌గ్గించిన ఇత‌ర బ్యాంకులు కూడా ఇప్పుడు పెంచే అవ‌కాశాలు ఉన్నాయి.వ‌డ్డీ రేటు పెంచ‌డ‌మే కాదు.. ఇక నుంచీ అన్ని హోమ్‌లోన్ల‌పై ప్రాసెసింగ్ ఫీజు కూడా వ‌సూలు చేయ‌నున్న‌ట్లు బ్యాంకు స్ప‌ష్టం చేసింది. బ్యాంకు ప్రాసెసింగ్ ఫీజు రూపంలో 0.4 శాతం ప్ల‌స్ జీఎస్టీ వ‌సూలు చేస్తుంది. ఇది సాధార‌ణంగా కనిష్ఠంగా రూ.10 వేలు, గ‌రిష్ఠంగా రూ.30 ప్ల‌స్ జీఎస్టీ ఉంటుంది. ప‌రిమిత స‌మ‌యానికి గ‌త నెల‌లో ఎస్‌బీఐ హోమ్‌లోన్ల‌పై వ‌డ్డీ రేటును త‌గ్గించ‌డంతోపాటు ప్రాసెసింగ్ ఫీజును ఎత్తేసిన విష‌యం తెలిసిందే.

Related Posts