YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విద్య-ఉపాధి తెలంగాణ

పాఠశాలలు మూసివేసినప్పుడు .. బార్లు, రెస్టారెంట్లకు ఎందుకు అనుమతిస్తున్నారు.. టీఆర్ఎస్ సర్కార్ ఉదాసీన వైఖరిని తప్పు పట్టిన హైకోర్టు

పాఠశాలలు మూసివేసినప్పుడు .. బార్లు, రెస్టారెంట్లకు ఎందుకు అనుమతిస్తున్నారు..  టీఆర్ఎస్ సర్కార్ ఉదాసీన వైఖరిని తప్పు పట్టిన హైకోర్టు

హైదరాబాద్ ఏప్రిల్ 6
రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరగడంపై తెలంగాణ రాష్ట్ర హైకోర్టు మంగళవారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వైరస్ వ్యాప్తిని నియంత్రించడంలో  టీఆర్ఎస్ సర్కార్ విఫలమవుతోందని ఆక్షేపించింది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ వస్తున్న దృష్ట్యా  వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి తీసుకుంటున్న చర్యలపై తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సమర్పించిన నివేదికపై హైకోర్టు విచారణ జరిపింది.కరోనా వైరస్ టెస్టుల విషయంలో కేసీఆర్ ప్రభుత్వం ఉదాసీన వైఖరిని హైకోర్టు తప్పు పట్టింది. పాఠశాలలు కళాశాలలను మూసివేసినప్పుడు బార్లు పబ్బులు రెస్టారెంట్లు మరియు థియేటర్లను పూర్తిస్థాయిలో నడపడానికి  ప్రభుత్వం ఎందుకు అనుమతిస్తుందని కోర్టు ప్రశ్నించింది. మొత్తం పరీక్షలలో 10 శాతం కూడా లేని ఆర్టీపీసీఆర్ పరీక్షలకు బదులుగా రాపిడ్ యాంటిజెన్ టెస్టులు మాత్రమే ఎందుకు చేస్తున్నారని  ప్రభుత్వాన్ని హైకోర్టు నిలదీసింది.  వివాహాలు అంత్యక్రియల్లో ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడుతున్నారని..  రద్దీ రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించింది. కోవిడ్ -19 పాజిటివ్ కేసులు.. మరణాల వివరాలను ప్రభుత్వం వెల్లడించాలని.. రైల్వే స్టేషన్లు బస్ స్టాండ్లు మరియు ఇతర బహిరంగ ప్రదేశాలలో కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించాలని హైకోర్టు ఆదేశించింది.ఆర్టీ-పిసిఆర్ పరీక్షల సంఖ్య క్రమంగా పెరుగుతోందని అడ్వకేట్ జనరల్ స్పష్టం చేయడానికి ప్రయత్నించినప్పుడు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా రెండవ వేవ్ దేశాన్ని చుట్టుముట్టిన వేళ పరీక్షల సంఖ్య నెమ్మదిగా పెంచుతారా? అని ప్రశ్నించింది. ఆర్టీ-పిసిఆర్ పరీక్షను వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.కోవిడ్ చికిత్సా కేంద్రాల గురించి విస్తృతంగా ప్రచారం చేయాలని అనాథాశ్రమాలు వృద్ధాప్య గృహాలపై దృష్టి పెట్టాలని కోర్టు ప్రభుత్వాన్ని కోరింది. 48 గంటల్లో నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Related Posts