YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

మంగళవారం నుండి 1 నుంచి 9వ తరగతులకు సెలవులు... టెన్త్, ఇంటర్ పరీక్షలు యథాతథం

మంగళవారం  నుండి 1 నుంచి 9వ తరగతులకు సెలవులు...  టెన్త్, ఇంటర్ పరీక్షలు యథాతథం

అమరావతి ఏప్రిల్ 19
కరోనా నియంత్రణపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిశానిర్దేశం చేశారని విద్యాశాఖమంత్రి  ఆదిమూలపు సురేష్‌ అన్నారు. కరోనాపై పూర్తి స్థాయిలో సమీక్ష జరిపామని మంత్రి తెలిపారు. 1 నుంచి 9వ తరగతులకు రేపటి నుంచి(ఏప్రిల్‌20) సెలవులు ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు. టెన్త్, ఇంటర్ పరీక్షలు యథాతథంగా జరుగుతాయన్నారు. విద్యార్థులు నష్టపోకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి స్పష్టం చేశారు.
 

Related Posts