YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

ఐసీఎస్ఈ ప‌ద‌వ త‌ర‌గ‌తి బోర్డు ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు

ఐసీఎస్ఈ ప‌ద‌వ త‌ర‌గ‌తి బోర్డు ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు

న్యూఢిల్లీ ఏప్రిల్ 20
ఐసీఎస్ఈ ప‌ద‌వ త‌ర‌గ‌తి బోర్డు ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేశారు. ఇండియ‌న్ స్కూల్ స‌ర్టిఫికేట్ ఎగ్జామినేష‌న్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఈ విష‌యాన్ని ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. క‌రోనా వైర‌స్ విజృంభిస్తున్న నేప‌థ్యంలో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. 12వ త‌ర‌గ‌తి బోర్డు ప‌రీక్ష‌ల‌ను మాత్రం ఆఫ్‌లైన్‌లో నిర్వ‌హించ‌నున్నారు. అయితే ఆ ప‌రీక్ష‌ల తేదీల‌ను త‌ర్వాత ప్ర‌క‌టిస్తారు. జూన్‌లో నిర్వ‌హించే స‌మీక్ష త‌ర్వాత ఈ నిర్ణ‌యం తీసుకోనున్నారు. ఏప్రిల్ 16వ తేదీన జారీ చేసిన స‌ర్క్యూల‌ర్‌ను ఉప‌సంహ‌రిస్తున్న‌ట్లు బోర్డు పేర్కొన్న‌ది. విద్యార్థులు, టీచింగ్ స్టాఫ్ ఆరోగ్యం కీల‌క‌మైంద‌ని, అందుకే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఐసీఎస్ఈ చెప్పింది.

Related Posts