YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

ఎల్జీ పొలిమర్స్ మూసేయండి

ఎల్జీ పొలిమర్స్ మూసేయండి

ఎల్జీ పొలిమర్స్ మూసేయండి
విశాఖపట్టణం, మే 1, 
విశాఖపట్నంలోని ఎల్జీ పాలీమర్స్‌ సంస్థలో ఉత్పత్తులు, ముడిసరకు విక్రయాలకు సంబంధించిన మొత్తాన్ని విశాఖ జిల్లా కలెక్టర్‌ వద్ద జమ చేయాలన్న అంశంపై రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు తాజాగా నోటీసులు జారీ చేసింది. ఎల్జీ పాలీమర్స్‌లో గతేడాది మే 7న విష వాయువు విడుదలై పలువురు మృతి చెందిన ఘటనపై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టింది. ప్రజల ప్రాణాలకు ముప్పుగా ఉన్న ఈ పరిశ్రమను మూసివేయాలని ఆదేశించింది.ఈ కేసులో భాగంగా ఎల్జీ పాలీమర్స్‌ సంస్థలో ఉత్పత్తులు, యంత్రాలను విక్రయించగా వచ్చిన ఆదాయాన్ని విశాఖ జిల్లా కలెక్టర్‌ వద్ద జమ చేయాలని తీర్పునిచ్చింది. హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ ఎల్జీ పాలీమర్స్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ యు.యు.లలిత్‌, జస్టిస్‌ ఇందిరా బెనర్జీ, జస్టిస్‌ కె.ఎం.జోసఫ్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది.పరిశ్రమ తరపున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించారు. మృతులు, బాధితుల కుటుంబాలకు ఇప్పటికే రూ.37.10 కోట్ల పరిహారం చెల్లించామని తెలిపారు. నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్‌ ఆదేశాల ప్రకారం రూ.50 కోట్లు డిపాజిట్ చేశామని వివరించారు.ఉత్పత్తులు, ముడిసరకు విక్రయంతో వచ్చిన సొమ్మును కలెక్టర్‌ వద్ద జమ చేయాలని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. ఈ వాదనలు విన్న ధర్మాసనం ప్రతివాదులుగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం, ఇతర సంస్థలకు నోటీసులు జారీ చేసింది. ఈ విషయాన్ని హైకోర్టులో అమికస్‌ క్యూరీగా వైవీ రవిప్రసాద్‌, రాష్ట్ర ప్రభుత్వ తరపు న్యాయవాది మహఫూజ్‌ నజ్కీకి తెలియజేయాలని రోహత్గీకి సూచించింది.గతేడాది ప్రమాదం తర్వాత పరిశ్రమలో కార్యకలాపాలను నిలుపుదల చేశారు. సంచలనం సృష్టించిన ఎల్జీ పాలిమర్స్ ఘటనకు కారకులుగా పేర్కొంటూ 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కంపెనీలో సామగ్రి, యంత్రాల విక్రయానికి అనుమతి కోరుతూ ఎల్జీ పాలిమర్స్ హైకోర్టులో పిటిషన్ వేసింది.దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే గోస్వామి, జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌ ధర్మాసనం విచారించింది. కంపెనీలో సామగ్రి అమ్మకానికి అనుమతించిన ధర్మాసనం.. యంత్రాలు అమ్మితే వచ్చిన మొత్తాన్ని డిపాజిట్‌ చేయాలని ఆదేశించింది. విశాఖ జిల్లా కలెక్టర్‌ వద్ద డబ్బును జమ చేయాలని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. తుది తీర్పు మేరకునడుచుకోవాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.

Related Posts