YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కఠినంగా కర్ఫ్యూ అమలు

కఠినంగా కర్ఫ్యూ అమలు

కడప
కడప జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు తీవ్రస్థాయిలో విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆదేశాల మేరకు కర్ఫ్యూ ఆంక్షలు కఠినంగా అమలు చేస్తున్నామని ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. కరోనా కట్టడికి జిల్లా వ్యాప్తంగా 600 పికెట్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రద్దీ ప్రాంతాలు, రైతుబజార్లు, షాపింగ్ మాల్స్లో భౌతిక దూరం, మాస్కుల ధరించడం వంటి వాటిపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో కొవిడ్ బాధితుల నుంచి అధిక ఫీజులు, రెమ్డెసివిర్ సూదిమందు ఎక్కువ ధరకు విక్రయిస్తే చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
 

Related Posts