న్యూఢిల్లీ మే 4
దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్నది. ప్రతిరోజూ లక్షల కేసులు, వేల మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూలు, ఫుల్డే కర్ఫ్యూలు, వీకెండ్ లాక్డౌన్లు, కంప్లీట్ లాక్డౌన్లు విధిస్తున్నాయి. అదేవిధంగా హర్యానా ప్రభుత్వం కూడా మే 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఏడు రోజులపాటు కంప్లీట్ లాక్డౌన్ విధించింది.కానీ, ప్రభుత్వం లాక్డౌన్ విధించినా కొందరు మాత్రం ఆ నిబంధనలను ఉల్లంఘిస్తూనే ఉన్నారు. మంగళవారం ఉదయం కూడా అంబాలా ఏరియాలో కొందరు లాక్డౌన్ నిబంధనలను లెక్కచేయకుండా రోడ్ల మీదకు రావడంతో పోలీసులు వారిని విచిత్ర రీతిలో శిక్షించారు. అందరినీ రోడ్డుపై వరుసలో నిలబెట్టి బింగీలు (గుంజీలు) తీయించారు.