YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

కేంద్రం నిర్ణయంతో పునరాలోచనలో ఏపీ

కేంద్రం నిర్ణయంతో పునరాలోచనలో ఏపీ

విజయవాడ, జూన్ 2, 
దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నప్పటికీ థర్డ్‌ వేవ్ హెచ్చరికలతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఎస్‌ఈ ప్లస్ టూ బోర్డు పరీక్షలను రద్దుచేస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. ప్రధాని ఆధ్వర్యంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత సమయంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల్లో ఆందోళన నెలకొని ఉందని, వారిలో ఒత్తిడి పెంచేలా విద్యార్థులను బలవంత పెట్టకుండా పరీక్షలు రద్దు చేయాలని ప్రధాని నిర్ణయించారు.కరోనా ప్రభావంతో ఇప్పటికే అనేక రాష్ట్రాలు పదో తరగతి పరీక్షలు రద్దు చేయగా.. మరికొన్ని వాయిదా వేశారు. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే తెలంగాణ ప్రభుత్వం టెన్త్ పరీక్షలు వాయిదా వేయడంతో పాటు మే నెలలో పరీక్షా ఫలితాలు కూడా ప్రకటించేసింది. అయితే ఆంధ్రప్రదేశ్‌‌లో జూన్ 7 నుంచి జరగాల్సిన పదో తరగతి పరీక్షలను ప్రభుత్వం నెల రోజుల పాటు వాయిదా వేసింది. అయితే విద్యార్థుల పరీక్షల విషయంలో కేంద్ర ప్రభుత్వమే కీలక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఏపీ సర్కార్ ఏం చేస్తు్ందోనన్నది ఇప్పుడు హట్‌టాపిక్‌గా మారింది.రాష్ట్రంలో టెన్త్, ఇంటర్ పరీక్షలను షెడ్యూల్‌ ప్రకారమే నిర్వహిస్తామని తేల్చిచెప్పిన జగన్ సర్కార్ ఆ తర్వాత కాస్త వెనక్కి తగ్గి ఇంటర్‌, టెన్త్ పరీక్షలను వాయిదా వేసింది. రాష్ట్రంలో పరిస్థితులు చక్కబడ్డాక టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించింది. ఇప్పుడు కేంద్రం తీసుకున్న కీలక నిర్ణయంతో ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఉత్కంఠ నెలకొంది.

Related Posts