YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం దేశీయం

ప్రైవేటీకరణ దిశగా మరో 2 బ్యాంకులు

ప్రైవేటీకరణ దిశగా మరో 2 బ్యాంకులు

ముంబై, జూన్ 7, 
కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ కసరత్తు ముమ్మరం చేసింది. మోదీ సర్కార్ రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరణ చేయాలని భావిస్తోంది. ఫిబ్రవరి నాటి బడ్జెట్‌లో కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులను ప్రైవేటీకరణ చేయనున్నారని తెలుస్తోంది.అయితే ఇప్పుడు మరో బ్యాంక్ కూడా ప్రైవేటీకరణ జాబితాలోకి వచ్చినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియాను కూడా ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. నీతి ఆయోగ్ కేంద్రానికి ఈ బ్యాంకుల పేర్లను సిఫార్సు చేసినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.ఇకపోతే కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల ప్రైవేకీకరణ మాత్రమే కాకుండా పలు ఇతర కంపెనీలను కూడా ప్రైవేటీకరణ చేయాలని భావిస్తున్న విషయం తెలిసిందే. బీపీసీఎల్ కంపెనీని ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అలాగే ఎయిర్ ఇండియాను విక్రయించాలని భావిస్తోంది.ప్రైవేటీకరణను పక్కన పెడితే... కేంద్ర ప్రభుత్వం ముందున్న అతిపెద్ద లక్ష్యం ఎల్‌ఐసీని స్టాక్ మార్కెట్‌లో లిస్టింగ్ చేయడం. మోదీ సర్కార్ ప్రభుత్వ రంగానికి చెందిన ఈ దిగ్గజ బీమా కంపెనీని ఐపీవోను తీసుకురావాలని యోచిస్తోంది. ఈ ఏడాదిలోనే ఈ ఐపీవో ఉండొచ్చు.

Related Posts