YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆటలు సినిమా ఆరోగ్యం కళలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

15 సెప్టెంబ‌ర్‌ వ‌ర‌కు ప‌ద్మ అవార్డుల నామినేష‌న్ల‌ స్వీక‌రణ

15 సెప్టెంబ‌ర్‌ వ‌ర‌కు ప‌ద్మ అవార్డుల నామినేష‌న్ల‌ స్వీక‌రణ

న్యూఢిల్లీ జూన్ 10
ప‌ద్మ అవార్డులు-2022 నామినేష‌న్ల‌ను 15 సెప్టెంబ‌ర్‌,2021 వ‌ర‌కు స్వీక‌రించ‌నున్న‌ట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. పద్మ అవార్డుల నామినేషన్లు, సిఫార్సులు ఆన్‌లైన్‌లో పద్మ అవార్డుల పోర్టల్ https://padmaawards.gov.in లో మాత్రమే స్వీకరించబడతాయ‌ని పేర్కొంది.పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటి. 1954 లో ప‌ద్మ అవార్డుల‌ను స్థాపించారు. ఈ అవార్డులు ప్రతి ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించబడతాయి. ఈ అవార్డు ‘వర్క్ ఆఫ్ డిస్టింక్షన్’ ను గుర్తించటానికి ప్రయత్నిస్తుంది.క‌ళ‌లు, సాహిత్యం, విద్య‌, ఆట‌లు, వైద్యం, సామాజిక సేవ‌, సైన్స్ అండ్ ఇంజనీరింగ్, పబ్లిక్ అఫైర్స్, సివిల్ వంటి అన్ని రంగాలలో విశిష్టమైన, అసాధారణమైన విజయాలు / సేవలకు ఈ అవార్డు ఇవ్వబడుతుంది. కాగా వైద్యులు, శాస్త్రవేత్తలు తప్ప పీఎస్‌యులతో పనిచేసే వారితో సహా ప్రభుత్వ ఉద్యోగులు పద్మ అవార్డులకు అర్హులు కాదు.

Related Posts