YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు దేశీయం

సీఎం మేనల్లుడిపై దాడి..అనుమానస్పదంగా మృతి

సీఎం మేనల్లుడిపై దాడి..అనుమానస్పదంగా మృతి

కోల్ కత్తా, జూన్ 8, 
పశ్చిమ్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీని ఆరేళ్ల కిందట చెంపదెబ్బ కొట్టిన వ్యక్తి ప్రస్తుతం అనుమానాస్పద స్థితిలో మరణించాడు. తీవ్ర గాయాలతో ఉన్న దేవాశీష్ ఆచార్య అనే వ్యక్తిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు గురువారం మిడ్నాపూర్‌లోని తామ్లూక్ జిల్లా ఆసుపత్రిలో వదిలేసివెళ్లిపోయారు. ఆసుపత్రి రికార్డుల ప్రకారం తెల్లవారుజామున 4 గంటలకు అతడిని ఆసుపత్రికి తీసుకొచ్చినట్టు సిబ్బంది పేర్కొన్నారు. అయితే, అదే రోజు మధ్యాహ్నం ఆశీష్ చనిపోయినట్టు తెలిపారు.ఇది ముమ్మాటికే హత్యేనని దేవశీష్ కుటుంబం ఆరోపించింది. పశ్చిమ్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ముందు గతేడాది దేవాశీష్ బీజేపీలో చేరాడని, అందుకే హత్యచేశారని అంటున్నారు. దేవశీష్ తన స్నేహితులతో కలిసి బైక్‌పై జూన్ 16 సాయంత్రం బయటకు వెళ్లాడు.. ఆ ముగ్గురు సోనాపేట్యా టోల్ ప్లాజా దగ్గర టీ స్టాల్ వద్ద ఆగారని పోలీసులు చెప్పారు. ఆ తర్వాత ఫోన్ రావడంతో దేవాశీష్ అక్కడి నుంచి వెళ్లిపోయాడని తెలిపారు. ఆ తర్వాత ఏం జరింగిదనే దానిపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.2015లో అభిషేక్ బెనర్జీని చెంపదెబ్బ కొట్టి దేవాశీష్ వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ఆ సమయంలో టీఎంసీ కార్యకర్తలు అతడిని చితకబాది, పోలీసులకు అప్పగించారు. అయితే, అతడి మానసిక పరిస్థితి బాగాలేదని కుటుంబ సభ్యులు చెప్పడంతో అరెస్ట్ చేయొద్దని పోలీసులకు అభిషేక్ సూచించారు. కానీ, అతడిపై హత్యాయత్నం సహా పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ, దేవాశీష్‌ను చితక్కొట్టిన తృణమూల్ కార్యకర్తలపై తూతూ మంత్రంగా కేసు బుక్ చేశారు.టీఎంసీ నేతలు, కార్యకర్తలు మాత్రం దేవాశీష్‌కు సరైన బుద్ధే చెప్పామని అప్పట్లో కామెంట్ చేశారు. అభిషేక్‌ను చెంపదెబ్బ కొట్టడాన్ని మాజీ ప్రధాని ఇందిర హత్యోందంతో టీఎంసీ నేత, మంత్రి సుబర్తా ముఖర్జీ పోల్చారు. ‘‘ఇందిరా గాంధీని చంపిన తర్వాత.. చాలా మంది ప్రజలు చంపబడ్డారు.. కానీ, ఇక్కడ మాత్రం ఆ యువకుడు సజీవంగానే ఉన్నాడు’’ అని వ్యాఖ్యానించారు.‘‘చెంపదెబ్బ కొట్టడం ఖండించదగిన సంఘటన.. చర్యకు ప్రతిచర్య దారుణంగా ఉండవచ్చు. అందరూ భారత్ సేవాశ్రమ్ సంఘం లేదా రామకృష్ణ మిషన్ నుంచి రాజకీయాలకు రారు. పెద్దగా ఏమీ జరగలేదు.. ఆ యువకుడు ప్రాణాలతోనే ఉన్నాడు’’ అని అప్పట్లో పేర్కొన్నారు. కాగా, దేవాశీష్ అనుమానాస్పద రీతిలో చనిపోవడంతో ఇది ముమ్మాటికే హత్యేనని కుటుంబ సభ్యులు, బీజేపీ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. కేసును సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Related Posts