YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

నిద్రలో నుంచి సంపులోకి చిన్నారి

నిద్రలో నుంచి సంపులోకి చిన్నారి

హైదరాబాద్, జూన్ 18, 
అబ్దుల్లాపూర్‌మెట్ మండలం అనాజ్‌పూర్ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. రెండు నెలల చిన్నారిని గుర్తుతెలియని కొందరు దుండగులు ఇంటిపైన ఉన్న వాటర్ ట్యాంకులో పడేశారు. బాబు కనిపించకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు చుట్టుపక్కలా వెతికారు. ఇంటిపైన ఉన్న వాటర్ సంపులో చిన్నారి విగతజీవిగా పడి ఉండటం గుర్తించారు. బాలుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటన గురించి స్థానికులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. బాబు మృతి చెందడంతో ఆ కుటుంబమే కాకుండా గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రాత్రి 2 గంటల వరకు తల్లిపక్కనే ఉన్న బాబు ఆ తర్వాత మాయమయ్యాడు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచాల రంగయ్య అనే వ్యక్తి కుమార్తెకు రెండు నెలల బాబు ఉన్నాడు. బాబు కనిపించకపోవడంతో తల్లిదండ్రులతో పాటు గ్రామస్థులు ఉదయం 4 గంటల నుంచి గ్రామంలో చుట్టుపక్కల మొత్తం వెతికారు. ఆ బాలుడి ఆచూకీ తెలియకపోవడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని గ్రామంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌లు పరిశీలించారు. అయినా ఎటువంటి ఆధారాలు లభించలేదు.దీంతో అనుమానించిన పోలీసులు ఇంటిపైన ఉన్న వాటర్ సంపులో చూడగా బాబు మృతదేహం లభ్యమైంది. రెండు నెలల బాబు ఇంటిపైన ఉన్న వాటర్ సంపులోకి ఎలా పడిపోయాడు? గుర్తు తెలియని వ్యక్తులు పడేసి ఉంటారనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబంలో గొడవలతోనే బాబును సంపులో పడేసి ఉంటారా? అనేది అనుమానిస్తున్నారు.

Related Posts