YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం తెలంగాణ

ఇక ప్రభుత్వానికి భారీగా ఆదాయము

ఇక ప్రభుత్వానికి భారీగా ఆదాయము

హైదరాబాద్, జూలై 1, 
ప్రభుత్వం ఇన్నాళ్లుగా అనేక ప్రాజెక్టుల పేరుతో వేలాది ఎకరాలను భూమిని రైతుల నుంచి స్వాధీనం చేసుకుంది. నష్టపరిహారం చెల్లింపుల్లో రిజిస్ట్రేషన్విలువకు మూడింతలు అంటూ లెక్క కట్టింది. ఇక భూ సేకరణ ప్రక్రియ దాదాపు ముగిసింది. ప్రభుత్వ చెల్లింపులు దాదాపు ముగిశాయి. ఈ క్రమంలోనే ధరల పెంపుతో ఆర్థిక భారం పడదని గుర్తించింది. ప్రభుత్వం ఎనిమిదేండ్ల తర్వాత తొలిసారి రిజిస్ట్రేషన్ విలువలను పెంచుతున్నట్లు స్పష్టం చేసింది. వ్యవసాయం, వ్యవసాయేతర ఆస్తుల ప్రస్తుత మార్కెట్విలువలను 40 నుంచి 60 శాతానికి పెంచనున్నట్లు సమాచారం. అయితే సబ్రిజిస్ట్రార్లు, తహశీల్దార్ల నుంచి ఎలాంటి ఫీడ్బ్యాక్తీసుకోకుండానే ఉన్నతాధికారులే ధరలను ప్రతిపాదించినట్లు తెలిసింది.ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు, వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాలతో గ్రామీణ ప్రాంతాల్లోని భూములకు భారీగా విలువ పెరిగినట్లు సమర్ధించుకుంది. రాష్ట్రానికి తరలివచ్చిన భారీ పెట్టుబడులు, పరిశ్రమలు, పలు ఇతర అభివృద్ధి కార్యక్రమాలు, నగర విస్తరణ వలన హైదరాబాద్ చుట్టుపక్కల భారీగా పెరిగిన ఆస్తులు/ భూముల విలువ అమాంతంగా పెరిగినట్లు చెబుతోంది. తెలంగాణలో భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువలను సవరించాలని రీసోర్స్ మొబిలైజేషన్ పైన ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ మంగళవారం అభిప్రాయపడింది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ ఆధ్వర్యంలో ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో మంత్రులు కె.తారకరామారావు, ప్రశాంత్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, స్టాంపులు/రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ శేషాద్రి, వివిధ శాఖ అధిపతులు పాల్గొన్నారు. ప్రజల పైన భారీగా భారం పడకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పెంచేందుకు ఉన్న అవకాశాలపైన ఇప్పటికే పలుసార్లు సమావేశమైన కేబినెట్ సబ్ కమిటీ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో సమావేశమైంది.రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి తెలంగాణ పెద్ద ఎత్తున అభివృద్ధి సాధిస్తూ వస్తున్నదని, దీంతోపాటు ప్రభుత్వం చేపట్టిన ఆ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ఫలితంగా భూముల విలువ భారీగా పెరిగిన విషయాన్ని అధికారులు మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్రంలో భూముల విలువను సవరించేందుకు ఉన్న అవకాశాల పైన వివిధ శాఖల ఉన్నతాధికారులతో సబ్ కమిటీ విస్తృతంగా చర్చించింది. మరోవైపు ప్రభుత్వం చేపట్టిన పలు సాగునీటి ప్రాజెక్టులు మరియు ఇతర వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాల ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ భూములకు సైతం పెద్ద ఎత్తున విలువ పెరిగిన విషయం సబ్ కమిటీ సమావేశంలో చర్చకు వచ్చింది.రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి భారీగా భూముల విలువ పెరిగినా, గత ఎనిమిది సంవత్సరాల్లో రిజిస్ట్రేషన్ విలువల్లో ఏలాంటి పెంపు చేయలేదు. ప్రభుత్వ నిర్ధారిత విలువల కన్నా అధిక మొత్తాల్లో భూములు, ఆస్తుల క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. చాలా మంది నిర్ధారిత ప్రభుత్వ విలువల మేరకే రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారని అధికారులు మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు. ఇలాంటి లావాదేవీల వల్ల సమాంతర ఆర్థిక వ్యవస్థ నడుస్తుందని అభిప్రాయపడ్డారు.చట్ట ప్రకారం ప్రభుత్వం ఎప్పటికిప్పుడు విలువల సమీక్ష చేయాల్సిన అవసరం ఉన్నదని అధికారులు చెప్పారు. చట్టం ఆధారంగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎనిమిది సంవత్సరాల్లో ఏడు సార్లు భూ విలువలను సవరించి, రిజిస్ట్రేషన్ ఫీజులను 11 శాతానికి పెంచినట్లు కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో చర్చించారు. తమిళనాడులో 7.5, మహారాష్ట్రలో 7 శాతంగా రిజిస్ట్రేషన్ ఫీజులు ఉన్నాయని అధికారులు మంత్రులకు వివరించారు. రిజిస్ట్రేషన్ ఆదాయంలో ప్రధాన వాటా కలిగిన హైదరాబాద్, హెచ్ఎండీఏ పరిధిలో పెద్ద ఎత్తున భూములు, ఆస్తుల విలువలు పెరిగిన విషయం సబ్ కమిటీలో విస్తృతంగా చర్చించారు.ఏడు సంవత్సరాలుగా హెచ్ఎండీఏ పరిధిలో ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, రాష్ట్రానికి తరలివచ్చిన భారీ పెట్టుబడులు, నూతన పరిశ్రమల ఏర్పాటు, నగర విస్తరణ వల్ల రియల్ భూం వచ్చిందన్నారు. 2019- 20 సంవత్సరానికి సంబంధించి హెచ్ఎండీఏ పరిధిలో జరిగిన రిజిస్ట్రేషన్లలో సుమారు 51 శాతం లావాదేవీలు ప్రభుత్వ నిర్ధారిత విలువలకు మించి అధికంగా రిజిస్ట్రేషన్లు జరిగినట్లు సబ్ కమిటీకి వివరించారు.మరోవైపు ప్రభుత్వ విలువ మార్కెట్ విలువ కన్నా చాలా తక్కువగా ఉండటంతో భూములు ఇల్లు కొనుగోలు చేసే ప్రజలకు బ్యాంకు లోన్లు రావడంలో కొన్ని పరిమితులు ఉంటున్నాయని, ఇలాంటి ఇబ్బందులు తొలగించేందుకు పెరిగిన విలువకు అనుగుణంగా సవరణ చేయాల్సిన అవసరం ఉందని కేబినెట్ సబ్ కమిటీ అభిప్రాయపడింది. వివిధ కారణాల సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న భూముల విలువల సవరణ వెంటనే చేపట్టాల్సిన అవసరం ఉందని కమిటీ చెబుతోంది. ఈ మేరకు కేబినెట్ సబ్ కమిటీ ఒక నివేదికను సీఎం కేసీఆర్ కు త్వరలోనే అందించాలని నిర్ణయం తీసుకుంది.

Related Posts