YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

జీవో 111పై హైకోర్టులో విచారణ

జీవో 111పై హైకోర్టులో విచారణ

హైదరాబాద్
తెలంగాణ హైకోర్టులో జీవో 111 పై విచారణ జరిగింది. చీఫ్  జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ వి.విజయసేన్ రెడ్డి ధర్మాసనం విచారణ జరిపింది. నాలుగేళ్లు దాటినా ఉన్నత స్థాయి కమిటీ నివేదిక ఎందుకు ఇవ్వడం లేదు. నివేదిక జాప్యం వెనక రహస్య ఎజెండా ఏమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కరోనా,  తదితర కారణాల వల్ల ఆలస్యమైందని అదనపు ఏజీ రామచంద్రరావు విన్నవించారు.   ఉన్నత స్థాయి కమిటీ సెప్టెంబర్ 13లోగా నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. నివేదిక సమర్పించకపోతే ఆ రోజుతో కమిటీ రద్దు అయినట్లేనని  హైకోర్టు వ్యాఖ్యానిచింది. ఈపీటీఆర్ఐ నివేదికపై కూడా అభిప్రాయాలను తెలపాలని కమిటీకి ఆదేశించింది. నివేదికను వెబ్ సైట్ లో పెట్టాలని కమిటీకి హైకోర్టు ఆదేశించింది.  కమిటీ నివేదికపై సెప్టెంబర్ నెలాఖరు నాటికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని సూచించింది. విచారణ అక్టోబరు 4కి వాయిదా వేసింది.

Related Posts