YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

దళిత బంధుకు మరో 500 కోట్లు విడుదల

దళిత బంధుకు మరో 500 కోట్లు విడుదల

హైదరాబాద్
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు తెలంగాణ దళిత బంధు పథకం పైలట్ ప్రాజెక్టు నిర్వహణకు గురువారం మరో 500 కోట్ల రూపాయలను కరీంనగర్ కలెక్టర్ ఖాతాకు రాష్ట్ర ఎస్సీ కార్పోరేషన్ విడుదల చేసింది. దళితబంధు పథకం పైలట్ ప్రాజెక్టు కోసం హుజూరాబాద్ ప్రారంభోత్సవం సభలో ఇటీవల  సిఎం కెసిఆర్ ప్రకటించిన రూ. 2000 కోట్ల నిధుల లక్ష్యం , నేడు విడుదల చేసిన రూ. 500 కోట్లతో సంపూర్ణమైంది. పైలట్ ప్రాజెక్టును చేపట్టేందుకు ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పూర్తిచేసుకున్నది. సిఎం కెసిఆర్ ఆదేశాలతో పూర్తి నిధులు నిధులు విడుదల కావడంతో ఇక దళిత బంధు పథకాన్ని నిబంధనలను అనుసరిస్తూ సిఎం కెసిఆర్ ఆకాంక్షల మేరకు చక చకా అమలు చేయడమే మిగిలింది. తేదీ 9.8.21 నాడు రూ. 500 కోట్లు, 23.08.2021 నాడు రూ. 500 కోట్లు, 24.08.2021 నాడు రూ. 200 కోట్లు, 25.08.2021 నాడు రూ. 300 కోట్లు, 26.08.2021 (నేడు) రూ. 500 కోట్లు......మొత్తం రూ. 2000 కోట్లు విడుదల అయ్యాయి.

Related Posts