YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

 దళిత బంధు  విజయవంతం చేయాలి

 దళిత బంధు  విజయవంతం చేయాలి

 దళిత బంధు  విజయవంతం చేయాలి
హైదరాబాద్, ఆగస్టు 27
ప్రాణత్యాగానికి సిద్ధపడి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విధంగానే దళితబంధు విజయవంతం కోసం కూడా అంతే గట్టిగా పట్టుపడతానని, నా చివరి రక్తపుబొట్టు దాకా దళితుల సమగ్రాభివృద్ధి కోసం పోరాడుతానని సీఎం కేసీఆర్ ప్రకటించారు. దళితబంధు పథకంపై సీఎం కేసీఆర్‌ ఇవాళ కరీంనగర్‌ కలెక్టరేట్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు హరీశ్రావు, కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌తో పాటు అధికారులు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. దళితజాతి పేదరికంలో మగ్గిపోతూ సామాజిక వివక్షకు గురవడానికి సభ్య సమాజమే కారణం అని తెలిపారు. ఎన్నటి నుంచి ఎవరు పెట్టిండ్రోగాని ఇది దుర్మార్గమైన ఆచారం, ఇప్పటికైనా దళితుల పట్ల అనుసరిస్తున్న దురాచారాన్ని కట్టడి చేసి వారి ఆర్థిక, సామాజిక అభ్యున్నతికి తెలంగాణ సమాజమంతా కదిలిరావాలి అని కేసీఆర్ పిలుపునిచ్చారు. పట్టుబట్టి తెలంగాణ సాధించుకున్నామని, అదే పట్టుదలతో తెలంగాణ స్వరాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటున్నామని, దళితుల సమగ్రాభివృద్ధి కూడా అంతే పట్టుదలతో సాధించుకుని తీరుతామని సీఎం స్పష్టం చేశారు. పట్టుపడితే తప్పకుండా సాధించే లక్షణం తెలంగాణ సమాజం ప్రత్యేకతని సీఎం కేసీఆర్ అన్నారు

Related Posts