YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఛలో గజ్వేల్ అంటున్న రేవంత్

ఛలో గజ్వేల్ అంటున్న రేవంత్

ఛలో గజ్వేల్ అంటున్న రేవంత్
మెదక్, ఆగస్టు 27,
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తదుపరి నిర్వహించే దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరాకు గజ్వేల్ వేదిక కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామమైన మూడుచింతలపల్లిలో ఇటీవలే రెండ్రోజుల దీక్ష నిర్వహించగా... మూడోసారి నిర్వహించే దళిత, గిరిజన దండోరా సభను ఏకంగా కేసీఆర్ నియోజకవర్గంలోనే తలపెట్టాలని టీపీపీసీ చీఫ్రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇందుకు పార్టీ అధిష్ఠానం కూడా ఓకే చెప్పేయడంతో గజ్వేల్ సభకు కాంగ్రెస్ శ్రేణులు ఉరకలు వేస్తున్నాయి.సీఎం దత్తత గ్రామంలో దీక్ష విజయవంతం కావడంతో ఈసారి గజ్వేల్‌లోనే దండోరా సభ చేపట్టాలని పీసీపీ నిర్ణయించింది. అయితే దీనిపై రాష్ట్ర నేతల్లో ఇంకా సయోధ్య కుదరనట్లుగా తెలుస్తోంది. గజ్వేల్ సభ వద్దంటూ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ఎన్నికల కమిటీ ఛైర్మన్ దామోదర రాజనర్సింహా అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే మూడుచింతలపల్లిలోనూ దీక్ష వద్దని కొందరు సీనియర్లు హెచ్చరించినా రేవంత్ పట్టుబట్టి మరీ దీక్ష చేపట్టి సక్సెస్ అయ్యారని, అందువల్ల గజ్వేల్ సభ విషయంలోనూ ఆయన వెనక్కి తగ్గే అవకాశం లేదని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభల్లో రేవంత్ రెడ్డి ద్విముఖ వ్యూహం అమలు చేస్తూ అధికార పార్టీకి ఇరుకున పెడుతున్నారు. ఓ వైపు ‘దళిత బంధు’ను విమర్శిస్తూనే, మరోవైపు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం రేకెత్తేలా ప్రసంగాలు చేస్తున్నారు. ఇంద్రవెల్లి, రావిల్యాల దండోరాలు విజయవంతం కావడంతో అదే జోష్‌లో గజ్వేల్‌లో దళిత, గిరిజన దండోరా నిర్వహించాలని పీసీసీ ఫిక్స్ అయిపోయింది. ఈ సభను ముందుగా నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఏర్పాటు చేయాలనుకున్నా.. మూడుచింతలపల్లిలో వచ్చిన రెస్పాన్స్ చూసి గజ్వేల్‌కు షిఫ్ట్ అయినట్లు సమాచారం. సెప్టెంబర్ మొదటివారంలో చేపట్టే ఈ సభలో దళిత బంధును కౌంటర్ చేయడంతో పాటు, ఏడున్నరేళ్లలో టీఆర్ఎస్ సర్కార్ చేపట్టిన దళిత, గిరిజన వ్యతిరేక కార్యక్రమాలపై గళమెత్తాలని కాంగ్రెస్ నేతలు ప్లాన్ చేసుకుంటున్నారు.

Related Posts