YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ప్రారంభమైన దళిత సర్వే

ప్రారంభమైన దళిత సర్వే

ప్రారంభమైన దళిత సర్వే
కరీంనగర్, ఆగస్టు 27,
ముఖ్యమంత్రి కేసీఆర్ కలల పథకమైన ‘దళిత బంధు’కు హుజురాబాద్‌‌ నియోజకవర్గాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే హుజురాబాద్‎లో శుక్రవారం అధికారులు సర్వే ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన గైడ్ లైన్స్‎ను జిల్లా కలెక్టర్ కర్ణన్ అధికారులకు అందజేశారు.హుజురాబాద్ నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో 200 మంది వివిధ శాఖల ఉద్యోగులు ఈ సర్వేలో పాల్గొంటున్నారు.ఈ సందదర్భంగా మొత్తం 48 అంశాలపై దళిత కుటుంబాల నుంచి వివరాలు సేకరించాల్సి ఉంది. ఐదు రోజుల్లో ఈ సర్వే పూర్తి చేయాలని జిల్లా యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సందర్భంగా హుజురాబాద్ ఆర్డీఓ రవీందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. దళిత బంధు సర్వేలో రెవెన్యూ అధికారులకు తోడుగా బ్యాంకు అధికారులు కూడా పాల్గొంటారని తెలిపారు. దళితుల సర్వే ద్వారా వివరించే అంశాలను పరిగణలోకి తీసుకొని వారికి ఏ పథకం వర్తిస్తుంది, వాటి వల్ల కుటుంబాలకు కలిగే ఆదాయం తదితర వివరాలను కూడా తెలియజేస్తామని పేర్కొన్నారు.

Related Posts