YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

టీటీడీ జంబో పాలకవర్గం

టీటీడీ జంబో పాలకవర్గం

తిరుపతి, సెప్టెంబర్ 16, 
ప్రతిష్ఠాత్మక తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుల నియామకం ఖరారైంది. వివిధ రాష్ట్రాలకు చెందిన అనేక మంది ప్రముఖులు తమ వారిని ఈ బోర్డులో అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి జగన్ కు సిఫార్సు చేసారు. రెండో సారి వరుసగా వైవీ సుబ్బారెడ్డిని ఛైర్మన్ గా నియమించిన తరువాత బోర్డును సైతం వెంటనే ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ దిశగా టీటీడీ బోర్డు కొత్త పాలక వర్గం ఖరారు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు చేసింది. దీనికి సంబంధించిన తుది జాబితా విడుదలైంది. 25మంది సభ్యుల జాబితా ఇలా ఉంది.బోర్డు సభ్యుల వివరాలను ఈ సాయంత్రం తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి అధికారికంగా ప్రకటించారు. పాలకమండలిలో కొత్త వారికే ఎక్కువ అవకాశం కల్పించినట్టు సుబ్బారెడ్డి తెలిపారు. ప్రత్యేక ఆహ్వానితులకు ఎలాంటి అధికారాలు ఉండవని స్పష్టం చేశారు. గత పాలక వర్గంలో మొత్తం 36 మంది సభ్యులు ఉండగా అందులో 24 మంది పాలకమండలి సభ్యులు, 8మందికి ప్రత్యేక ఆహ్వానితులుగా అవకాశం కల్పించారు. నలుగురు ఎక్స్‌ అఫిషియో సభ్యులుగా నియమితులయ్యారు. అయితే ఈసారి ఆ సంఖ్యను కుదించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారికి అవకాశం కల్పిస్తూ పాలకమండలి కూర్పు జరిగింది.ఏపీ నుంచి పోకల అశోక్‌కుమార్‌, మల్లాడి కృష్ణారావు, వేమిరెడ్డి ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, గొర్ల బాబూరావు, మధుసూదన్‌ యాదవ్‌, తెలంగాణ నుంచి మై హోం అధినేత జూపల్లి రామేశ్వరరావు, జీవన్‌రెడ్డి, లక్ష్మీనారాయణ, పార్థసారథిరెడ్డి, మారంశెట్టి రాములు, కల్వకుర్తి విద్యాసాగర్‌రావు, తమిళనాడు నుంచి శ్రీనివాసన్‌, ఎమ్మెల్యే నందకుమార్‌, కన్నయ్య, కర్నాటక నుంచి శశిధర్‌, ఎమ్మెల్యే విశ్వనాథరెడ్డి, మహారాష్ట్ర నుంచి శివసేన కార్యదర్శి మిలింద్‌కు అవకాశం కల్పించారు. మారుతి, సౌరభ్‌ , కేతన్‌ దేశాయ్‌, శ్రీనివాసన్‌ పేర్లు పాలకమండలి సభ్యుల జాబితాలో ఉన్నట్టు సమాచారం,ఎలా చూసినా దాదాపుగా టీటీడీ బోర్డు పదవుల్లోకి 80 మంది ఉంటారన్న ప్రచారం జరుగుతోంది. తిరుమల శ్రీవారి ఆలయంలో పదవి అంటే ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కానీ ఎలా పడితే అలా అందర్నీ నియమిస్తే పవిత్ర దెబ్బతింటుంది. అందుకే గత ప్రభుత్వాలు టీటీడీ బోర్డు సభ్యుల విషయంలో చాలా కఠినంగా ఉండేవి. బోర్డులో పన్నెండు మంది వరకే ఉంచేవారు. కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చట్టాలను మార్చింది. 24 మంది పాలకమండలి సభ్యులు, నలుగురు ఎక్స్ అఫీషియో సభ్యులు, ఏడుగురు ప్రత్యేక ఆహ్వానితులతో పాలక మండలిని ఏర్పాటుచేశారు. ఇప్పుడు ఆ సంఖ్య 80 కి చేరుకునే అవకాశం కనిపిస్తోంది. పాలక మండలి సభ్యుల సంఖ్యను అధికారికంగా పెంచాలనుకున్నా ఇప్పుడు కష్టం కాబట్టి ప్రత్యేక ఆహ్వానితుల కేటగిరిలో చేర్చాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.   టీటీడీ బోర్డు సభ్యుడంటే కొన్ని సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుంది. కొండ పైన పర్మినెంట్ గా కాటేజీ, ఎప్పుడు వెళ్లినా అవసరాలు చూసుకోవడం, వాహనం, రోజుకు రెండు వందల బ్రేక్ దర్శన టిక్కెట్లు కేటాయిస్తూ ఉంటారు. భక్తుల సొమ్ముతో వారికి ఇవన్నీ కేటాయించాల్సి ఉంటుంది. కేంద్రంలో పనులు చేసుకోవడానికి టీటీడీ బోర్డు పదవుల్ని క్విడ్ ప్రో కో పద్దతిలో ఇస్తున్నారని ఇందు కోసం ప్రత్యేక విమానాల్లో విజయసాయిరెడ్డి పలు రాష్ట్రాలకు వెళ్లి వస్తున్నారని రఘురామకృష్ణరాజు ఆరోపించారు. టీటీడీ బోర్డు సభ్యుల ప్రకటన తర్వాత మరింత దుమారం రేగడం ఖాయంగా కనిపిస్తోంది.

Related Posts