YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు దేశీయం

రైల్లో ప్ర‌యాణిస్తున్న మ‌హిళ‌పై దోపిడీ దొంగ‌లు లైంగిక‌దాడి

రైల్లో ప్ర‌యాణిస్తున్న మ‌హిళ‌పై దోపిడీ దొంగ‌లు లైంగిక‌దాడి

ముంబై అక్టోబర్ 9
రైల్లో ప్ర‌యాణిస్తున్న ఓ మ‌హిళ‌పై దోపిడీ దొంగ‌లు లైంగిక‌దాడికి పాల్ప‌డ్డారు. స్లీప‌ర్ కోచ్‌లో ప్ర‌యాణిస్తున్న ఓ మ‌హిళ‌పై ఎనిమిది మంది దోపిడీ దొంగ‌లు క‌త్తుల‌తో బెదిరించి అత్యాచారానికి పాల్ప‌డ్డారు. అంత‌టితో ఆగ‌కుండా ఆ కోచ్‌లో ప్ర‌యాణిస్తున్న ప్ర‌యాణికుల నుంచి న‌గ‌దు, ఆభ‌ర‌ణాల‌ను అప‌హ‌రించారు.  ఈ దారుణ ఘ‌ట‌న ల‌క్నో – ముంబై పుష్ప‌క్ ఎక్స్‌ప్రెస్ రైల్లో శుక్ర‌వారం రాత్రి చోటు చేసుకుంది. దొంగ‌ల దాడిలో ఐదారు మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. దీంతో ప్ర‌యాణికులు ఆందోళ‌న‌కు గురై గ‌ట్టిగా అర‌వ‌డంతో రైలును ముంబైలోని కాస‌రా స్టేష‌న్ వ‌ద్ద ఆపేశారు. అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు ఆ కోచ్ వ‌ద్ద‌కు చేరుకుని ఇద్ద‌రు దొంగ‌ల‌ను అరెస్టు చేశారు. ఆ త‌ర్వాత మ‌రో ఇద్ద‌రిని అదుపులోకి తీసుకున్నారు. మ‌రో న‌లుగురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. దొంగ‌ల నుంచి రూ. 34 వేల న‌గ‌దు, ఇత‌ర వ‌స్తువుల‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Related Posts