హైదరాబాద్
దసరా పండుగకు రాకపోకలు సాగించే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మరో 8 ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. విశాఖపట్నం-సికింద్రాబాద్ (నం.08579) 13, 20, 27 తేదీల్లో, సికింద్రాబాద్-విశాఖపట్నం (08580) 14, 21, 28, విశాఖపట్నం-తిరుపతి (08583) 18, 25, తిరుపతి-విశాఖపట్నం (08584) 19, 26, విశాఖపట్నం-సికింద్రాబాద్ (08585) 19, 26, సికింద్రాబాద్-విశాఖపట్నం (08586) 20, 27 తేదీల్లో ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. మరో రెండు రైళ్లు చెన్నై సెంట్రల్-సంత్రగచ్చీ మధ్య రాకపోకలు సాగించనున్నాయి.