YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

బ్లాక్ మనీ ఎంత పట్టుకుస్తున్నారో..

 బ్లాక్ మనీ ఎంత  పట్టుకుస్తున్నారో..

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీపై వ్యంగస్త్రాలు సంధించారు. ‘మోదీజీ.. స్విట్జర్లాండ్‌ నుంచి తిరిగి స్వాగతం. స్విస్‌లో దాచిన బ్లాక్ మనీని తిరిగి భారత్ రప్పిస్తానని మీరు ఇచ్చిన హామీని ఓసారి గుర్తుచేసుకోండి. స్విస్ నుంచి మీతోపాటు విమానంలో ఎంత బ్లాక్ మనీ పట్టుకుస్తున్నారోనని ఇక్కడ యువత ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోంది’ అంటూ ట్విట్టర్ వేదికగా రాహుల్ వ్యంగస్త్రాలు విసిరారు.
ప్రపంచ వార్షిక ఆర్థిక సదస్సుకు హాజరయ్యేందుకు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌కు ఇటీవల ప్రధాని మోదీ వెళ్లిన సంగతి తెలిసిందే. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మోదీ ప్రభుత్వం దేశంలో బ్లాక్ మనీని అరికట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. భారత్‌కు సంబంధించిన బడాబాబులు కూడబెట్టిన బ్లాక్ మనీ స్విస్ బ్యాంకులో మూలుగుతోందని.. ఆ నల్లడబ్బును ఎలాగైనా స్విస్ నుంచి భారత్‌కు రప్పిస్తానని మోదీ నొక్కివక్కానించిన సంగతి తెలిసిందే

Related Posts