YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కేంద్ర హోంశాఖ మంత్రి అమి త్ షా తిరుపతి పర్యటన

కేంద్ర హోంశాఖ మంత్రి అమి త్ షా తిరుపతి పర్యటన

కేంద్ర హోంశాఖ మంత్రి అమి త్ షా తిరుపతి పర్యటన
తిరుపతి
ఈ నెల 14వ తేదీ దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమి త్ షా ఈనెల 13వ తేదీ రాత్రి 7.40 నిమిషాలకు తిరుపతి ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. అక్కడనుండి 7:45 నిమిషాలకు బయలుదేరి రాత్రి 8.05 గంటలకు తాజ్ హోటల్ కు చేరుకొని రాత్రికి అక్కడే బస చేస్తారు. మరుసటి రోజు ఉదయం ఈనెల 14వ తేదీ ఉదయం 9.20 గంటలకు తిరుపతి తాజ్ హోటల్ నుండి బయలుదేరి 10.25 గంటలకు నెల్లూరు జిల్లాకు చేరుకుని మధ్యాహ్నం 12.55 వరకు అక్కడి స్థానిక కార్యక్రమాల్లో కేంద్ర హోం శాఖ మంత్రి పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 2.15 గంటలకు తిరిగి తిరుపతి ఏర్పోర్ట్ చేరుకొని అక్కడినుండి బయలుదేరి 2.40 గంటలకు తాజ్ హోటల్ కు చేరుకొని దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి మండలి సమావేశంలో పాల్గొని రాత్రికి అక్కడే బస చేస్తారు. ఈనెల 15వ తేదీ ఉదయం 7.30 గంటలకు తిరుపతి తాజ్ హోటల్ నుండి బయలుదేరి 8.10 గంటలకు తిరుమల చేరుకొని శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం ఉదయం 9.05 గంటలకు బయలుదేరి 9.40 గంటలకు తిరుపతి తాజ్ హోటల్ చేరుకుని 10 గంటల నుండి 2.30 గంటల వరకు స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతి ఏర్పోర్ట్ నుండి బయలుదేరి సాయంత్రం 5.55 గంటలకు న్యూఢిల్లీ చేరుకుంటారు

Related Posts