YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు దేశీయం

రూ.1.50 కోట్లు పాము విషం విక్రయం గుట్టురట్టు

రూ.1.50 కోట్లు పాము విషం విక్రయం గుట్టురట్టు

భువనేశ్వర్‌ నవంబర్ 22
పాము విషం విక్రయం ముందస్తు సమాచారం పోలీసులకు అందింది. దీంతో విషం విక్రయం గుట్టురట్టయింది. అప్రమత్తమైన పోలీసులు ఈ వ్యవహారానికి సంబంధించి ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేసి, స్టేషన్‌కి తరలించారు. అనంతరం వారి నుంచి 1 కిలోగ్రాము పాము విషం స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ దాదాపు రూ.1.50 కోట్లు ఉంటుందని అంచనా.ప్రస్తుతం జప్తు చేసిన పాము విషం పరీక్షల కోసం ప్రయోగశాలకు తరలించారు. పట్టుబడిన నిందితుల్లో సంబల్‌పూర్‌ జిల్లా, సిందూర్‌పంక్‌ గ్రామస్తుడు కైలాస్‌ సాహు, సఖిపొడా గ్రామస్తుడు రంజన్‌కుమార్‌ పాఢి ఉన్నారు. రాష్ట్రేతర ప్రాంతాల నంచి సేకరించిన పాము విషాన్ని దేవ్‌గఢ్‌ ప్రాంతంలో విక్రయించేందుకు మంతనాలు జరుగుతుండగా, పోలీసులు దాడి చేసినట్లు సమాచారం.  

Related Posts