YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

గుంటుపల్లిలో దొంగల ముఠా హల్ చల్

గుంటుపల్లిలో దొంగల ముఠా హల్ చల్

విజయవాడ
కృష్ణా జిల్లా గుంటుపల్లిలో ఓ దొంగల ముఠా హల్చల్ చేసింది. మొత్తం ఐదుగురు అగంతకులు మారణాయుధాలతో అర్ధరాత్రి నల్లూరి అపార్ట్మెంట్లోకి ప్రవేశించారు. మొదటి అంతస్తులో ఉండే ఇళ్లలోకి దూరి దొంగతనానికి ప్రయత్నించారు. అయితే ఇంటి తలుపులు పగలగొట్టే శబ్ధాలు విని అపార్ట్మెంట్ వాసులు నిద్రలేచారు. అప్రమత్తమై లైట్లు వేయడంతో దొంగల ముఠా భయంతో అక్కడి నుంచి పరారైంది. సమాచారం అందుకున్న పోలీసులు నల్లూరి అపార్ట్మెంట్కు చేరుకుని దొంగలు పగలగొట్టేందుకు ప్రయత్నించిన ఇళ్ల తలుపులను పరిశీలించారు. అనంతరం అపార్ట్మెంట్ వాసులతో మాట్లాడి దర్యాప్తు ప్రారంభించారు.
కాగా ఈ దొంగల ముఠా దోపిడీకి సంబంధించిన దృశ్యాలు అపార్ట్మెంట్లో ఉండే సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. వీటిని చూస్తుంటే మొత్తం ఐదుగురు అగంతకులు ముసుగులు ధరించి మారణాయుధాలతో అపార్ట్మెంట్లోకి వచ్చారని తెలుస్తోంది. వీరి వేషధారణ, ఆయుధాలను చూసి నగరంలోకి చెడ్డీ గ్యాంగ్ ప్రవేశించిందేమోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కాగా సోమవారం విజయవాడలో కూడా ఇలాంటి దోపిడీ ఒకటి జరిగింది. కొందరు దోపిడీ దొంగలు చెనుమోలు వెంకట్రావు ఫ్లైఓవర్ వద్దగల అపార్ట్ మెంట్లోకి ప్రవేశించి మొదటి అంతస్తులోని ఓ ఇంట్లో తలుపు పగలగొట్టి బంగారంతో పాటు నగదును దోచుకున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు కూడా సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

Related Posts