YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

శిల్ప కేసులో తెరపైకి కొత్త పేరు .. ఆ డబ్బంతా ఎక్కడికెళ్లింది?

శిల్ప కేసులో తెరపైకి కొత్త పేరు ..  ఆ డబ్బంతా ఎక్కడికెళ్లింది?

శిల్ప కేసులో తెరపైకి కొత్త పేరు ..
 ఆ డబ్బంతా ఎక్కడికెళ్లింది?
హైదరాబాద్
అధిక వడ్డీల పేరు చెప్పి రూ.కోట్లు కొల్లగొట్టినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న శిల్పా చౌదరిని నార్సింగ్ పోలీసులు ఈరోజు కూడా ప్రశ్నించారు. గండిపేట సిగ్నేచర్ విల్లాస్లో ఉంటున్న శిల్పాచౌదరి దంపతులు కిట్టీ పార్టీలతో ప్రముఖ కుటుంబాలకు చెందిన మహిళలతో స్నేహం చేశారు. భవన నిర్మాణాలు, రియల్ ఎస్టేట్, సినీ వ్యాపారాల్లో పెట్టుబడులు పెడితే లాభాలిస్తామంటూ బురిడీ కొట్టించి కోట్లాది రూపాయలు వసూలు చేశారు. బాధితుల ఫిర్యాదుతో నార్సింగ్ పోలీసులు మూడు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాలమేరకు రెండ్రోజుల కస్టడీకి తీసుకున్న పోలీసులు విచారణలో ఆమె నుంచి పలు విషయాలు సేకరించారు. పలువురి నుంచి తీసుకున్న సొమ్మును ఏం చేశారనే కోణంలో ప్రశ్నలు సంధించారు. తన వద్ద రాధిక అనే మహిళ డబ్బులు తీసుకుందని శిల్ప చెప్పినట్టు సమాచారం. స్థిరాస్తి వ్యాపారంలో భాగంగా రాధికకు డబ్బులు ఇచ్చానని, ఆమె తిరిగి డబ్బులు చెల్లించకపోవడంతో నష్టపోయానని చెప్పినట్టు సమాచారం. ‘సెహరి’ చిత్ర నిర్మాణంలో శిల్ప 12శాతం పెట్టుబడి పెట్టినట్టు పోలీసులు గుర్తించారు. గండిపేట సిగ్నేచర్ విల్లాలోని శిల్ప ఇంటికి ఆమెను తీసుకెళ్లి సోదాలు నిర్వహించిన పోలీసులు పలు దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఎవరికీ డబ్బులు ఎగ్గొట్టాలనే ఉద్దేశం తనకు లేదని పోలీసుల ఎదుట శిల్ప వాపోయినట్టు సమాచారం. ఈనేపథ్యంలో శిల్ప పేర్కొన్న రాధికను పోలీసులు ప్రశ్నించే అవకాశముంది. రెండ్రోజుల పోలీస్ కస్టడీ ఇవాళ్టితో ముగియనుండటంతో సాయంత్రం ఉప్పర్పల్లి కోర్టులో హాజరుపర్చారు.

Related Posts